ఐదారు సినిమాలకే హీరోగా విజయ్ దేవరకొండ, హీరోయిన్ గా రష్మిక మందన్న స్టార్ క్రేజ్ దక్కించుకున్నారు. ఇక ఇద్దరు కలిసి చేసిన రెండు సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం సినిమాలో గీత పాత్రలో అలరించింది రష్మిక. ఆ సినిమాలో హీరోయిన్ కోసం చాలామందిని అడిగారట. కాని ఆ రోల్ చేయలేమని చెప్పారట. అప్పుడే ఛలో సినిమాతో అలరించిన రష్మిక పరశురాం దృష్టిలో పడ్డది. వెంటనే ఆమెను అడగడం సినిమా చేయడం బ్లాక్ బస్టర్ అవడం జరిగింది.

 

ఆ సినిమాతో విజయ్, రష్మికల జోడీకి కూడా సూపర్ క్రేజ్ వచ్చింది. సినిమాలు చేసినా చేయకపోయినా ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది అన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక మరోసారి డియర్ కామ్రేడ్ సినిమాతో ఇద్దరు కలిసి నటించారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. అందుకే కొద్దిగా గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి డైరక్షన్ లో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చేసే సినిమాలో మళ్లీ రష్మికనే హీరోయిన్ గా కావాలని అంటున్నాడట.

 

రష్మిక కూడా ప్రస్తుతం పుష్ప సినిమాకు సైన్ చేసింది. తమిళంలో తుపాకి 2కి సెలెక్ట్ అయ్యింది. షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్న గోవిందం కోసం అదే విజయ్ గోవింద్ కోసం గీత ఎప్పుడు రెడీగా ఉంటుందని తెలుస్తుంది. ఇద్దరి కెమిస్ట్రీ తెర మీద బాగా వర్క్ అవుట్ అవుతుండటంతో ఈ జోడీపై ప్రేక్షకుల అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. లేటెస్ట్ గా టాలీవుడ్ హాట్ పెయిర్ గురించి చెప్పుకోవాలంటే ముందుగా విజయ్, రష్మికల గురించి ప్రస్థావించాల్సి వస్తుంది.                                

మరింత సమాచారం తెలుసుకోండి: