టాలీవుడ్ లో చిరంజీవి సినిమా అనగానే చాలా వరకు ఫాన్స్ కి ఒక రేంజ్ లో  పండగ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుంది అంటే చాలు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎదురు చూసే వాతావరణం అయితే టాలీవుడ్ లో ఉంటుంది అనే చెప్పాలి. ఆయన కూడా ఈ మధ్య వరుసగా సినిమాలను ఓకే చేస్తున్నారు. ఆయన ఏ మాత్రం ఖాళీ గా ఉండే ప్రయత్నం మాత్రం చేయడం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఆయన సినిమాలు అనగానే యూత్ లో గతం లో ఉన్న క్రేజ్ ఇప్పుడు కూడా ఉంది అనే విషయం అందరికి తెలుసు. 

 

ఇక ఆయన లాక్ డౌన్ లో కూడా ఏ మాత్రం కూడా భయపడకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కరోనా లో కూడా ఆయన భయపడకుండా తాను చెయ్యాల్సిన లూసిఫర్ సినిమాకు సంబంధించి ఆయన తన యువ దర్శకులకు సలహాలు ఇచ్చి కథను తెలుగు కి నచ్చిన విధంగా మార్చాలి అంటూ సలహాలు ఇచ్చారు. వారు కూడా అదే విధంగా కష్టపడి కథను మార్చే కార్యక్రమాలు చేస్తున్నారు. సుజిత్ లాంటి యువ దర్శకుడికి ఆయన ఆ బాధ్యత ఇచ్చారు. మరో యువ దర్శకుడి పేరు కూడా వినపడింది కాని అది నిజమా కాదా అనేది స్పష్టంగా తెలియదు. 

 

ఇక చిరంజీవి చేస్తున్న ఆచార్య సినిమా గురించి లాక్ డౌన్ లో చాలానే వార్తలు వచ్చాయి. అందులో ప్రధానంగా రామ్ చరణ్ లేదా మహేష్ బాబు లేదా ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర చేసే అవకాశం ఉంది అనే దాని మీద చాలానే ప్రచారం ఈ లాక్ డౌన్ లో జరిగింది అనే చెప్పాలి. కాని ఈ సినిమాలో ఎవరు నటించేది తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: