కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన సావిత్రి సినిమాలో పాప నటన చూసిన ఎవరు అయినా సరే ఆమెకు ఫిదా కావాల్సిందే. టాలీవుడ్ లో ఆమె గురించి అక్కడి నుంచి ఎన్నో వార్తలు వచ్చాయి. ఆమె నుంచి ఏ ప్రకటన వస్తుందా అంటూ ఫాన్స్ చాలా వరకు ఎదురు చూస్తూ వచ్చారు కూడా.  ఆమె సినిమాలు అప్పటి నుంచి జనాలకు హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఇక ఆమె కూడా చాలా వరకు జాగ్రత్తగా సినిమాలు చేయడమే కాకుండా ఏ మాత్రం భయపడకుండా లాక్ డౌన్ లో విడుదల చేస్తుంది. 

 

ఇక ఆమె సోషల్ మీడియాలో కూడా కాస్త లాక్ డౌన్ లో చాలా బాగా యాక్టివ్ అయింది అనే వార్తలు వస్తున్నాయి. గతంలో ఆమె అసలు సోషల్ మీడియా ను వాడేది కాదు కాని ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో అడుగు పెట్టి జనాలకు వినోదం అందించే ప్రయత్నం కీర్తి చేస్తుంది. లాక్ డౌన్ లో ఆమె వరుసగా సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. మహేష్ తో కూడా ఆమెకు ఆఫర్ వచ్చింది. త్రివిక్ర౦ ఎన్టీఆర్ సినిమాకు కూడా ఆమెను తీసుకునే అవకాశం ఉంది అనే దాని మీద కూడా చాలానే చర్చలు ఇప్పుడు టాలీవుడ్ లో దాదాపుగా నడుస్తున్నాయి అనే చెప్పాలి. 

 

ఇక ఇప్పుడు టాలీవుడ్ లో జనాలు కూడా ఆమె సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు అనేది స్పష్టంగా చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఆమె ఓటీటీ లో విడుదల చేసిన ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక మరో సినిమా మిస్ ఇండియా కూడా ఆమె విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: