ప్రస్తుతం కంటికి కనిపించని కరోనా కోరల్లో చిక్కుకుని ప్రపంచదేశాలు విలవిలలాడిపోతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకెందరు ఈ వైరస్ బారిన పడి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వ్యాక్సిన్ లేని ఈ ప్రాణాంతక వైరస్ను కట్టడి చేసేందుకు పలు దేశాలు లాక్డౌన్ కూడా విధించాయి. ఈ లాక్డౌన్ కారణంగా సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇంటికే పరిమితం అయ్యారు. అయితే లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితం అయినప్పటికీ కొందరు సెలబ్రెటీలు హాట్ టాపిక్గా మారారు. అందులో మెగా డాటర్ నిహారిక కూడా ఒకరు.
లాక్డౌన్ తన నెటిజన్లతో దాగుడు మూతలు ఆడుతూ.. తనకు కాబోయే వాడిని పరిచయం చేసేసింది ఈ బ్యూటి. ఇక నిహారికకు కాబోయే వరుడు.. గుంటూరు ఐజీ కుమారుడు వెంకట చైతన్య జొన్నలగడ్డ. చైతన్య.. హైదరాబాద్లోని ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడితోనే నిహా ఏడడుగులు నడవబోతుంది మెగా డాటర్. అంతేకాదు, చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో పరిచయం ఉండటం.. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ స్నేహితులు కావడంతో ఈ సంబంధం సెట్ అయిందని చెప్పుకొచ్చారు.
ఇక దీంతో నిహారిక, చైతన్యల నిశ్చితార్థం ఈ ఏడాది ఆగస్టులో, అదేవిధంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరగనుందని వార్తలు రాగా.. త్వరలోనే నిశ్చితార్థం ఉంటుందని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. అలాగే నిహారిక- చైతన్య కలిసి దిగిన ఫోటోలు జట్ స్పీడ్లో వైరల్ అయిపోయాయి. ఓ ఫోటోలో ముద్దు పెడుతూ.. మరో ఫోటోలో కౌగిలించుకుని ఉన్న ఫోటోలు మెగా అభిమానులను తెగ ఆకర్షించాయి కూడా. ఏదేమైనా లాక్డౌన్ వేళ నిహారిక తనకు కాబోయే వాడిని పరిచయం చేస్తూ.. హాట్ టాపిక్గా మారింది.