అగ్ర హీరోల సినిమాల విషయానికి వస్తే మాత్రం ఇప్పుడు కథల విషయంలో దర్శక నిర్మాతలు చాలా వరకు జాగ్రత్తలు పడుతున్నారు నే వార్తలు బాగానే వస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాల్లో ఉండే కథల విషయంలో గతంలో మాదిరి లైట్ తీసుకోవడం లేదు. ఇప్పుడు కమర్షియల్ అనే కోణం లేదు కాబట్టి గతంలో మాదిరిగా సినిమాల్లో కాస్త ఆ హంగులు పెట్టి సినిమాలు చేస్తే చూసే అవకాశం లేదు. ఇప్పుడు కథ బాగుంది అనుకుంటే ఓటీటీ లో అయినా సరే సినిమాను చూస్తారు జనాలు. ఆ విధంగా సినిమాను ప్లాన్ చేస్తున్నారు మన తెలుగు లో దర్శక నిర్మాతలు అని అంటున్నారు. 

 

అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా మరో హీరో సినిమా అయినా సరే ఇదే విధంగా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు కథ విషయంలో పట్టు ఉండాలి అని స్టార్ హీరోలు ముందే చెప్తున్నారు అనీ సమాచారం. కథ చాలా వరకు కూడా అందంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. లాక్ డౌన్ సమయంలో హీరోలు అందరూ కూడా ఇప్పుడు రచయితలు గా మారిపోయి కథలో అసలు కమర్షియల్ అనే కోణం లేకుండా ఉండే విధంగా జాగ్రత్తలు పడి కథలను మార్చాలి అని సూచనలు చేస్తున్నారు అని తెలుస్తుంది. 

 

అగ్ర హీరోలతో పాటుగా చిన్న హీరోలు కూడా కథల విషయంలో గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అని సమాచారం. నానీ ప్రభాస్ వంటి హీరోలు మహేష్ బాబు ఎన్టీఆర్ వంటి హీరోలు అందరూ కూడా ఇప్పుడు కథ విషయంలో చాలా వరకు జాగ్రత్తగానే ఆలోచించి ముందుకు అడుగులు వేస్తున్నారు అనే చెప్పాలి. మరి అది ఎంత వరకు ఫలిస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: