మన తెలుగు ప్రేక్షకులకు గతంలో మాదిరిగా సినిమాలు యాక్షన్ ఉండి ఒక పది మందిని హీరో కొట్టి  ఆ పది మంది హీరో కాళ్ళ మీద పడి అలాంటి సినిమాలు అవసరం లేదు. ఇప్పుడు చాలా వరకు కూడా సాఫ్ట్ గా సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. సినిమాలు చూసే విషయంలో అదే విధంగా ఉంటుంది. మంచి కథ ఉన్న సినిమాలకు మంచి ఆదరణ వస్తుంది. పాన్ ఇండియా సినిమాల విషయంలో కూడా ఇప్పుడు జనాలు అలాగే ఉన్నారు. హీరో ఒక పది  మందిని కొట్టడం దానికి ఈలలు చప్పట్లు ఇది వరకు మాదిరిగా నచ్చడం లేదు జనాలకు. 

 

సినిమా చూసి ఇంటికి వెళ్తే ఒక ఫీల్ అనేది సినిమా మీద ఉండాలి. అలాంటి సినిమాలనే దాదాపుగా చూసే పరిస్థితి ఆదరించే పరిస్థితి అయితే ఉంది అనే చెప్పాలి. ఇప్పుడు టాలీవుడ్ లో జనాలు అందరూ కూడా అదే విధంగా సినిమాలు తీసే ఆలోచనలో ఉన్నారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో అసలు యాక్షన్ సన్నివేశాలు అనేవి లేకుండా సినిమాను ప్లాన్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. లాక్ డౌన్ లో దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు అని ఎన్టీఆర్ కథలో సాఫ్ట్ గా ఉండాలి మాస్ కి   నచ్చాలి అనే విధంగా చెప్పాడు అని అంటున్నారు. 

 

త్రివిక్రమ్ కూడా అదే విధంగా చాలా జాగ్రత్తగా తన సినిమాను ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా రావాలి అంటే ఎన్టీఆర్ ఇప్పుడు  ఇప్పుడు చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా రావాల్సి ఉంది. అప్పుడు మాత్రమే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే సూచనలు ఉన్నాయి. ఆర్ ఆర్ అర్ లో ఎన్టీఆర్ పాత్ర ఇంకా పూర్తి కాలేదు అని టాక్. అది లేట్ అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: