ఆరెక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ను ఊపేసిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఓ ఐదారు సినిమాలతో వచ్చే క్రేజ్ ను ఒక్క సినిమాతో సంపాదించింది. ఇక ఆ సినిమా తర్వాత కొద్దిగా కెరియర్ లో సరైన కథల ఎంపిక లేక తడపడ్డ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఇక మీదట అలా జరగకుండా జాగ్రత్త పడతా అంటుంది. అంతేకాదు ఐటం సాంగ్స్, గ్లామర్ షోల జోలికి వెళ్లనని అంటుంది. అదేంటి పాయల్ హీరోయిన్ గా నటిస్తుంది అంటే ఆడియెన్స్ లో కొన్ని అంచనాలు ఉంటాయి అవి చేయకపోతే ఎలా అనుకోవచ్చు. పాత్రకు అవసరం అనిపిస్తే ఎలా అయినా కనిపించడానికి తాను రెడీ అంటుంది అమ్మడు.

 

ఇదిలాఉంటే లాక్ డౌన్ మొత్తం తన పేరెంట్స్ తోనే గడిపానని చెప్పిన పాయల్ తెలుగులో ఇద్దరు స్టార్స్ తో నటించడమే తన డ్రీం అని చెప్పుకొచ్చింది. ఇంతకీ అమ్మడు నటించాలని ఇష్టపడుతున్న ఆ స్టార్స్ ఎవరంటే ఒకరు ప్రభాస్, మరొకరు విజయ్ దేవరకొండ. ఇద్దరు మాస్ హీరోలనే ఎంచుకుంది పాయల్. ఆరెక్స్ 100 సినిమాను కార్తికేయకు ముందు విజయ్ దేవరకొండతోనే చేయాలని అనుకున్నాడు డైరక్టర్ అజయ్ భూపతి. కాని విజయ్ ఎందుకో ఆ ప్రాజెక్ట్ చేయాలని అనుకోలేదు. ఆ ఛాన్స్ అందుకున్న కార్తికేయ ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.

 

ఇక అదే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన పాయల్ కూడా సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న ఈ అమ్మడు మరో సినిమా కథను ఫైనల్ చేసిందట. అదేంటి అన్నది త్వరలోనే ఎనౌన్స్ చేస్తారని అంటుంది. ఈ 3 నెలలు తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో సోషల్ మీడియాలో టచ్ లో ఉంటూ వచ్చింది పాయల్.        

మరింత సమాచారం తెలుసుకోండి: