త్రివిక్రమ్ దర్శకత్వం లో నటించాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. యువ హీరోలు కూడా చిన్న పాత్రలు చేయడానికి అవకాశం వచ్చినా సిద్ధమైపోతారు. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి మంచు మనోజ్ విలన్ గా నటించనున్నాడన్న వార్త అభిమానులని ఎదురు చూసేలా చేస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తున్న సినిమాకి మంచు మనోజ్  విలన్ గా చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ విషయం పై మంచు మనోజ్ స్పందించాడు. అయితే హీరోగా మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని అనుకున్న మంచు మనోజ్ రూట్  మారిపోతుందా.. ?  

 

అహం బ్రహ్మాస్మి అనే కొత్త సినిమాని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న సినిమా కోసం మంచు మనోజ్ చాలా కష్ట పడ్డాడు. కేవలం ఫిట్నెస్ విషయం లోనే కాకుండా నటన పరంగా కూడా కొత్త అడుగులు వేయడానికి అతను సిద్ధమయ్యాడు. అయితే ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ ని మంచు మనోజ్ ప్రత్యేకంగా కలిసాడన్న టాక్ అంతా చుట్టేసింది.  అయితే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం లో మంచు మనోజ్ విలన్ గా చేయనున్నాడని ప్రచారం కూడా సాగింది.

 

అయితే  మంచు మనోజ్ ఇప్పుడు వివరణ ఇచ్చాడు తనకి విలన్ గా చేయాలని ఉంది కానీ ఇప్పుడు మాత్రం చేయాలని లేదు. అలానే తాను ఎన్టీఆర్ సినిమాలో విలన్ పాత్రని  చేయట్లేదని ఎవర్ని సంప్రదించ లేదని కూడా క్లియర్ చేశాడు.  నెట్టింట్లో షికార్లు కొట్టిన ఆ పుకార్లు ఏమి నిజం కాదని  ప్రతి ఒక్కరికి ఈ మనోజ్ స్పందన పై పూర్తి క్లారిటీ వచ్చేసింది. మనోజ్ ఏ రూట్ మారడం లేదని, ఎన్టీఆర్ సినిమా లో విలన్ పాత్ర చెయ్యడం లో ఏ మాత్రం నిజం లేదు అని అన్నాడు హీరో మంచు మనోజ్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: