మహానటితో బయోపిక్ అంటే ఇలా తీయాలని చూపించి ప్రశంసలు అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈసినిమా తరువాత అతను, రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయనున్నాడు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈచిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినిదత్ నిర్మించనున్నాడు.
 
ఇక ఈసినిమా కథతోనే  డైరెక్టర్ కావాలనుకున్నానని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. 2007లోనే ఈకథ రాశాను ఆతరువాత ఈ10ఏళ్లలో స్క్రిప్ట్ లో భారీగా మార్పులు చేశాను. ఈసినిమాకోసం విఎఫ్ఎక్స్ కూడా నేర్చుకున్నాను కేవలం ఈకథ కారణంగానే డైరెక్టర్ కావాలని నిర్ణయించుకున్నానని తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో నాగ్ అశ్విన్ వెల్లడించాడు.ఇక ప్రస్తుతం ప్రభాస్ 20వ సినిమా చేస్తున్నాడు. ఈచిత్రాన్ని పూర్తి చేసిన తరువాత నాగ్ అశ్విన్ తో సినిమా చేయనున్నాడు. 
 
ఇదిలావుంటే ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరపడింది. ప్రభాస్ 20వ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ దాదాపు ఏడాదికి పైగా ఎదురుచూశారు. ఇక ఈశుక్రవారం ఉదయం10గంటలకు టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదలచేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్యూర్ లవ్ స్టోరీ గా జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఇప్పటివరకు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా కరోనా వల్ల ప్రస్తుతం వాయిదాపడింది. ఆగస్టు నుండి తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈసినిమా కోసం ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ లను నిర్మిస్తున్నారు. గోపి కృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం తెలుగు తోపాటు తమిళ, మలయాళ హిందీ భాషల్లో వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: