ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి ఇంతక ముందెన్నడు లేని విధంగా ఒత్తిడికి లోనవుతున్నాడని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. అందుకు కారణం ప్రస్తుతం ఆయన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కిస్తున్న భారీ పీరియాడికల్ సినిమా "రౌద్రం రణం రూధిరం". ఇప్పటికే ఈ సినిమా 80 శాతం పూర్తయిందని సమాచారం.

 

అంతేకాదు ఈ మధ్య ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించి రక రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో బాహుబలి సినిమాను మించి తారక్, చరణ్ ల ఎలివేషన్ సీన్స్ ఉంటాయని .. ప్రేక్షకులను కట్టిపడేసే ఎమోషనల్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా విషయంలో రాజమౌళిపై ఒత్తిడి పెరుగుతుందట. 20 శాతమే మిగిలి ఉన్న సినిమాని కంప్లీట్ చేయడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నప్పటికి అందుకు అడుగు ముందుకు పడటం లేదు.

 

అదీకాక ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న తారక్ ఎలా ఉండబోతున్నాడో అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చరణ్ అల్లూరి పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ వీడియోను విడుదల చేసారు. దాంతో తారక్ అభిమానులకి క్యూరియాసిటి పెరిగిపోతుంది. అయితే అది కూడా రాజమౌళి కి సాధ్యపడలేదు.

 

అయితే ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న తారక్ ఫ్యాన్స్ వచ్చి ఇప్పుడు రాజమౌళి మీద పడబోతున్నారని అంటున్నారు. ఖచ్చితంగా ఇక రాజమౌళి కి టెన్షన్ మొదలవుతుందేమో అని చెప్పుకుంటున్నారు. అందుకు కారణం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రభాస్20 ఫస్ట్ లుక్ పోస్టర్ కు అనౌన్స్ మెంట్ రావడమే. అందుకే తారక్ ఫ్యాన్స్ నుంచి రాజమౌళి పై ఇప్పుడు ఒత్తిడి మొదలైందని సమాచారం.

 

అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాజమౌళి కి తారక్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలన్నా వీడియో టీజర్ వదలాలన్నా సమయం పడుతుంది కదా..అని కొందరు జక్కన్న వైపు మాట్లాడుతున్నారట. మరి అదీ నిజమే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: