శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు పవన్ కెరీర్ లోనే చేయనటువంటి ఒక కొత్త జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ( జాగర్లమూడి రాధాకృష్ణ ) క్రిష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా పీరియాడికల్ బ్యాగ్డ్రాప్ లో రూపొందుతుంది. మొఘలుల కాలం నాటి కథ ని క్రిష్ వెండి తెరమీద ఆవిష్కరించబోతున్నాడు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో దొంగగా కనిపిస్తాడని తెలుస్తుంది. 

 

అయితే ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి విరూపాక్ష అన్న టైటిల్ ని చిత్ర బృందం పెట్టాలనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. అయితే అధికారకంగా మాత్రం అసలు టైటిల్ ఇదే అని చిత్ర యూనిట్ వెల్లడించలేదు. ఇంతలోనే మరో రెండు టైటిల్స్ ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలు పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

 

క్రిష్ తెరకెక్కించే కథ ప్రకారం ఈ సినిమాకి గజదొంగ లేదా బందిపోటు అనే టైటిల్స్ అయితే సూటవుతాయన్న ఆలోచనలో ఉన్నారట. మాస్ ఆడియన్స్ ని దృష్ఠిలో పెట్టుకొనే ఉద్దేశ్యంతో ఈ రెండింటిలో ఒక టైటిల్ ని ఫైనల్ చేసే దిశగా దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ రెండు టైటిల్స్ తో సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆ కాలంలో సూపర్ హిట్స్ గా నిలిచాయి. కాని ఆ కాలానికి తగ్గట్టు అప్పట్లో ఆ టైటిల్ ట్రెండ్ అయి ఉండొచ్చు గాని ప్రస్తుతం ఈ జనరేషన్ కి ..ట్రెండ్ కి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు సూటవవేమో అన్న అనుమానాలు ఫ్యాన్స్ లో కలుగుతున్నాయట. మరి ఈ టైటిల్స్ ఫైనల్ చేస్తారా లేదా అన్నది ఇంకా తెలియదు.

 

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాని వేణు శ్రీరాం తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: