ప్రముఖ రచయిత వక్కంతం వంశీ కి దర్శకుడిగా అవకాశం ఇస్తూ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా చేశాడు బన్ని. అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సస్ ని అందుకోలేపోయింది. దాంతో చాలా గ్యాప్ తీసుకొని చాలా కథ లు విని ఫైనల్ గా మాటల మాంత్రీకుడు త్రివిక్రం తో అల వైకుంఠపురంలో సినిమా చేశాడు. ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళని సాధించి ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియోట్ చేసింది. అంతేకాదు 2020 లో ఈ సినిమాదే రికార్డ్ అని చెప్పాలి.

 

ఈ సక్సస్ తో ఇక వరుసగా సినిమాలు చేయాలనుకున్న బన్నీ తరువాత సుకుమార్ తో పుష్ప సినిమాని చేస్తున్నాడు. అల వైకుంఠపురంలో సినిమా ప్రమోషన్స్ నుండే జుట్టు, గడ్డం పెంచి ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచేశాడు. అనుకున్నట్టుగా ఈ మేకోవర్ పుష్ప కోసమే అని ఈ సినిమా ఫస్ట్ లుక్ రీజ్ చేసి షాకిచ్చాడు. ఇక ఈ సినిమా సుకుమార్ బన్నీ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో భారీగా ప్లాన్ చేశారు. 

 

అందుకే అయిదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. ఇక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న బన్ని సరసన నటిస్తోంది. ఇక ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాలన్న బన్ని ప్లాన్స్ అన్ని ఇప్పుడు తారుమారయ్యాయి. పక్కాగా ప్లాన్స్ వేసుకున్న సుకుమార్ బన్నీ లకి కరోనా వైరస్ దెబ్బకొట్టింది. ఇప్పటికే పుష్ప షూటింగ్ కి మూడు నెలల బ్రేక్ పడింది.

 

2020 లోనే పుష్ప సినిమాని విడుదల చేయాలనుకున్న బన్నీ ఆశలన్ని ఆవిరైపోయాయి. ఇక ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం పుష్ప 2021 సమ్మర్ కి వస్తుందని వార్తలు వినిపిస్తుండగా అప్పటికైనా సాధ్యమవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. 

మరింత సమాచారం తెలుసుకోండి: