ఆర్ ఎక్స్ 100 సినిమాతో విజయం దక్కించుకుని తన రెండవ సినిమాకి రెడీ అవుతోన్న దర్శకుడు అజయ్ భూపతి, రెండవ సినిమా మహాసముద్రం కోసం చాలా కష్టాలు పడుతున్నాడు. మొదటి సినిమా విజయం వచ్చిన తర్వాత కూడా అతనికి రెండో సినిమా అవకాశం అంత తొందరగా రాలేదు. సాధారణంగా ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఏ దర్శకుడికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వదేమో. అయితే అజయ్ భూపతికీ అంత ఈజీగా హీరో దొరకలేదు.

 

 

మొదట రవితేజతో మహాసముద్రం ఉంటుందని అన్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో రవితేజ తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అజయ్ భూపతి నాగచైతన్యకి కథ వినిపించాడు. నాగచైతన్య కథ విషయంలో సంతృప్తికరంగానే ఫీల్ అయ్యాడట. కానీ తన చేతిలో ఉన్న సినిమాల కారణంగా మహాసముద్రంలో నటించడానికి టైమ్ పడుతుందని అన్నాడని, అందువల్ల ఆ కథ శర్వానంద్ వద్దకి చేరుకుందని టాక్.

 

 

మహాసముద్రం లో నటించడానికి శర్వా అంగీకరించాడట. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ అనిల్ సుంకర్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోందట. ఈ విషయమై ఇప్పటి వరకూ అధికారిక సమాచారం రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం మహాసముద్రం ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయట. క్యాస్టింగ్ ని సెలెక్ట్ చేసే పనిలో ఉన్న అజయ్ భూపతి శర్వా సరసన హీరోయిన్ గా రాశీఖన్నాని తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

 

 

ఇదే నిజమైతే రాశీకి తెలుగులో మళ్లీ మంచి ఛాన్స్ వచ్చినట్టే. వెంకీ మామా, ప్రతీరోజూ పండగే వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నా కూడా ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాలేదు. దాంతో తమిళంపై కాన్సన్ ట్రేట్ చేసింది. మరి ఈ సినిమాతో మళ్లీ తెలుగులో కెరీర్ ని నిలబెట్టుకుంటుందేమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: