మహానటి సినిమాలో తన నటనతో నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న భామ కీర్తి సురేష్. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో తెరకెక్కిన మహానటి సినిమాలో సావిత్రమ్మే కీర్తిలో పరకాయ ప్రవేశం చేసినా అన్నంతగా తన అభినయంతో మెప్పించింది. మహానటి తర్వాత సౌత్ లోనే కాదు నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఈమధ్య ఓటిటిలో పెంగ్విన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈశ్వర్ సుబ్బరాజ్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కీర్తి నటనకు అందరు ప్రశంసిస్తున్నారు.

 

సినిమా తర్వాత కీర్తి సురేష్ నటిస్తున్న మరో రెండు సినిమాలు కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతాయని తెలుస్తుంది. కీర్తి సురేష్ నటిస్తున్న గుడ్ లక్ సక్షితో పాటుగా మిస్ ఇండియా సినిమాలు కూడా ఓటిటిల బాట పడుతున్నాయి. కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతుండటం వల్ల థియేటర్లు ఇప్పుడప్పుడే ఓపెన్ చేసే అవకాశం కనిపించడం లేదు. అందుకే మీడియం, మినిమం బడ్జెట్ సినిమాలు ఓటిటిలో తమ సినిమాలు రిలీజ్ చేస్తున్నాయి.

 

కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ ఇప్పటికే ఓటిటిలో రిలీజై హిట్ అందుకోగా ఆమె నటించిన మరో రెండు సినిమాలు కూడా ఓటిటి బాట పడుతున్నాయి. ఈ సినిమాల తర్వాత కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుందని తెలిసిందే. సినిమాలో ఆమె ఓ బ్యాంక్ ఎంప్లాయీ పాత్రలో కనిపిస్తుందట.

 

తెలుగుతో పాటుగా తమిళ, మళయాళ భాషల్లో కూడా కీర్తి సురేష్ తన ఫాం కొనసాగిస్తుంది. తెలుగులో అజ్ఞాతవాసి తర్వాత కొద్దిగా గ్యాప్ ఇచ్చినా మళ్లీ మహేష్ సినిమాతో ఇక్కడ కూడా సత్తా చాటాలని చూస్తుంది. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి సినిమాలతో నయా ఓటిటి హీరోయిన్ గా కీర్తి సురేష్ కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: