సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ఈసంక్రాంతికి విడుదలై 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం స్మాల్ స్క్రీన్ ను సైతం ఊపేసింది. ఉగాది రోజున ఈసినిమా మొదటి సారి జెమినీ టీవి లో ప్రసారం కాగా అత్యధికంగా 23.3 టీఆర్పీ ని రాబట్టి టాలీవుడ్ లో హైయెస్ట్ రేటింగ్స్ ను రాబట్టిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక  కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా రెండో సారి ప్రసారం కాగా 17.4 టీఆర్పీని రాబట్టి అదుర్స్ అనిపించింది.
 
అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈచిత్రంలో రష్మిక కథానాయికగా నటించగా దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించాడు. దిల్ రాజు ,అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈసినిమా తరువాత మహేష్ బాబు,గీత గోవిందం ఫేమ్ పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాటలో నటించనున్నాడు. ఇటీవలే టైటిల్ తో పాటు ప్రీ లుక్ పోస్టర్ విడుదలకాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాలో మహేష్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. థమన్ సంగీతం అందించనుండగా 14రీల్స్ ప్లస్ నిర్మించనుంది. సెప్టెంబర్లో ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: