2020లో కరోనా వల్ల ప్రజలంతా ఎన్ని బాధలు పడుతున్నారో తెలిసిందే. కరోనా తీవ్రత ముందు కనిపెట్టే ప్రభుత్వం 41 రోజుల లాక్ డౌన్ విధించింది. అయితే కరోనా నుండి బయటపడాలంటే కేవలం ప్రభుత్వం విధించే లాక్ డౌన్ మాత్రమే కాదు వ్యక్తిగత జాగ్రత్తలు కూడా కచ్చితంగా అవసరం. దీన్ని ఉదహరిస్తూ టాలీవుడ్ స్టార్ కమెడియన్ ప్రియదర్శి 2020లో కేవలం రెండే రెండు ఎస్సెన్షియల్ అందులో ఒకట్ మాస్క్, రెండోది షార్ట్.. వాటిని ఫోటో తీసి ఇన్ స్టాగ్రాంలో పెట్టాడు. 

 

2020 సో ఫార్.. ఎస్సెన్షియల్స్ తో ఇన్ స్టాగ్రాం లో ప్రియదర్శి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2020లో మొదటి రెండు నెలలు మాత్రమే బయట తిరగ్గా మార్చి నుండి అందరు ఎవరు ఇంట్లో వారే ఉంటూ వచ్చారు. అన్ లాక్ ప్రక్రియ మొదలైనా కూడా సెలబ్రిటీస్ ఇంటి నుండి బయటకు వచ్చేందుకు మాత్రం సుముఖంగా లేరు. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల సెలబ్రిటీస్ అంతా ఇళ్లలోనే ఉంటున్నారు. 

 

ఓ పక్క సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లతో కూడా బిజీగా ఉన్నాడు ప్రియదర్శి. రీసెంట్ గా అతను నటించిన లూజర్ వెబ్ సీరీస్ ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమాలో అతని పర్ఫార్మెన్స్ చూసి సెలబ్రిటీస్ కూడా మెచ్చుకున్నారు. వెబ్ సీరీస్ లో లూజర్ విన్నర్ గా నిలిచాడని కొనియాడారు. మొత్తానికి అటు సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లతో కూడా ప్రియదర్శి తన సత్తా చాటుతున్నాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#essentials #2020SoFar

A post shared by Priyadarshi (@preyadarshe) on

మరింత సమాచారం తెలుసుకోండి: