టాలీవుడ్ "అల్లరి" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేష్ జూనియర్ రాజేంద్ర ప్రసాద్ గా పాపులారిటీని సాధించాడు. కామెడీ హీరోగా 50 సినిమాలు కంప్లీట్ చేశాడు. కెరీర్ మొత్తంలో కామెడీ సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చి అదే జోనర్ లో రక రకాల కథలతో ప్రయోగాలు చేసి హిట్స్ అందుకున్నాడు. అంతేకాదు అల్లరి నరేష్ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారెంటీ హీరోగా వసూళ్ళు సాధించి నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టాడు.

 

అంతేకాదు మధ్యలో గమ్యం, శంభో శివ శంభో, మహర్షి లాంటి సినిమాలు చేశాడు. ఇక ఈ మధ్య కాస్త వరస ఫ్లాపులొస్తుండటంతో చిన్న గ్యాప్ తీసుకొని జోనర్ మార్చాడు. కొత్త ప్రయోగం..ప్రయత్నం చేస్తున్నాడు. నాంది అనే సినిమాలో ఒక డిఫ్రెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు. దర్శకుడు సతీష్ వేగేష్న నిర్మాతగా మారుతు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. 

 

ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ మొదటి సారి నగ్నంగా కూడా నటించాడు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా విడుదల చేసినన టీజర్ నాంది సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. ప్రస్తుతం ఈ సినిమా సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉండగా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. అయితే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కార్యక్రమాలను చిత్ర బృందం కంప్లీట్ చేస్తుంది. 

 

ఇక రీసెంట్ గా అల్లరి నరేష్ ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పోలీస్ కస్టడీలో ఉన్న ఖైదీలను ఎంతగా హింసిస్తారో సినిమాలో చూపించబోతున్నట్టు తెలిపాడు. అంతేకాదు పోలీసుల అరాచకాలు ఈ సినిమాలో చూపిస్తారట. అయితే పోలీసుల గురించి మరి కఠినంగా చూపిస్తే సెన్సార్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదీకాక అల్లరి నరేష్ నగ్నంగా కనిపించే సీన్స్ కి సెన్సార్ సమస్యలు వస్తాయని అంటున్నారు. అయితే ఇదే సినిమాని బాగా ప్రమోట్ చేస్తుంది. మొత్తానికి అల్లరి నరేష్ సినిమా రిలీజ్ కి ముందే సంచలనం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: