టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నా సరే ఒక్కోసారి లక్ కలిసి రాక వెనకపడాల్సి వస్తుంది. ఇక చేస్తున్న సినిమాలు అటు హిట్టు ఇటు ఫ్లాపుకి మధ్యలో రిజల్ట్ వస్తున్నా ఆ డైరక్టర్స్ కు ఛాన్సులు రావు. ప్రస్తుతం ఇలాంటి కోవకే చెందుతాడు క్రేజీ డైరక్టర్ సురేందర్ రెడ్డి. ధృవ హిట్టుతో సత్తా చాటగా వెంటనే సైరా ఛాన్స్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ అయిన ఆ సినిమాను ఉన్నతవరకు బాగా హ్యాండిల్ చేశాడు సురెందర్ రెడ్డి.

 

ఇక ఆ సినిమా చేసిన తర్వాత వెంటనే స్టార్ ఛాన్సులు వస్తాయని అనుకోగా వెయిట్ చేయక తప్పట్లేదు. రీసెంట్ గా తను రాసిన కథను క్రిష్ మెచ్చి నిర్మించడానికి రెడీగా ఉన్నాడు. క్రిష్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాం ఇద్దరిలో ఒకరు ఫైనల్ అవుతారని అంటున్నారు. అయితే ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం సూరితో సినిమాఉ రెడీగా లేరని తెలుస్తుంది. 

 

అందుకే సురేందర్ రెడ్డి ఈసారి అక్కినేని కాంపౌండ్ లోకి వచ్చాడు. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా ఉంటుందని అంటున్నారు. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ ఉంది. తమిళ దర్శకుడు మిత్రన్ తో అఖిల్ సినిమా ఉండాల్సింది కాని ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టి ముందు సురేందర్ రెడ్డితో సినిమా చేయాలని చూస్తున్నాడు అఖిల్.                           

మరింత సమాచారం తెలుసుకోండి: