బాహుబ‌లి తో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్ర‌పంచానికి తెలిసింది. అప్ప‌టి నుండి మ‌న టాలీవుడ్ హీరోలంద‌రూ పాన్ ఇండియా చిత్రాల తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మం లో యువ క‌థానాయ‌కుడు ఆది సాయికుమార్‌ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ రూపొందించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఒక సిరీస్ ‌లా చేయడానికి ప్లాన్ చేస్తుండ‌టం విశేషం.

 

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ హీరోగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న ఆది సాయి కుమార్ ఈ పాన్ ఇండియా చిత్రం త‌న‌కు పెద్ద బ్రేక్ అవుతుంద‌ని భావిస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ ర్‌గా తెరకెక్క‌బోతున్న ఈ చిత్రం లో ఫాంట‌సీ ఎలిమెంట్స్‌, వి.ఎఫ్‌.ఎక్స్‌ ల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది. య‌స్.వి.ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రై. లి బ్యాన‌ర్‌ పై డెబ్యూ డైరెక్టర్ బాలవీర్.య‌‌స్‌ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న‌ ఈ చిత్రాన్ని య‌స్‌.వి.ఆర్ నిర్మిస్తున్నారు. 

 

ఇది వ‌ర‌కు ఆది సాయికుమార్ చేసిన చిత్రాల‌కు భిన్నంగా కామిక్ ట‌చ్‌తో సాగే చిత్ర‌మిది. మేక‌ర్స్ రెండేళ్ల పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్‌పై దృష్టి పెట్టారు. ప‌క్కా అంద‌రినీ ఆక‌ట్టుకునేలా స్క్రిప్ట్‌ను రూపొందించారు. ఈ పాన్ ఇండియా సిరీస్‌లో చాప్ట‌ర్1 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా ఆది సాయి కుమార్‌ హీరో ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. కెరీర్‌ స్టార్టింగ్‌లో కాస్త ఆకట్టుకున్నా.. తరువాత వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డాడు.

 

అయితే అవకావాలు మాత్రం తగ్గలేదు. వరుసగా గ్యా ప్‌ లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ఆది. లవ్‌ స్టోరీలతో పాటు, మాస్‌, యాక్షన్‌ లాంటి సినిమాలను కూడా చేస్తున్నాడు ఆది.

మరింత సమాచారం తెలుసుకోండి: