యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ మంచి కమర్షియల్ హిట్ ని అందుకున్నాడు. ఈ సినిమాలో తారక్ యాక్షన్ ఎపిసోడ్ లో రెచ్చిపోయాడు. చెప్పాలంటే అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత త్రివిక్రం కి ఈ సినిమా మంచి సక్సస్ ని ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం త్రివిక్రం స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నాడు. అయితే ముందు అనుకున్న స్క్రిప్ట్ కంటే ఇప్పుడు ఇంకా భారీ స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

 

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. పోరాట యోధులుగా చరణ్, తారక్ నటిస్తున్న ఈ సినిమాని ఫిక్షన్ కథాంశంతో రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. కొమరం భీం గా తారక్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఒలియా మోరెస్, అజయ్ దేవగణ్, శ్రియ శరణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  

 

ఇక ఎన్.టి.ఆర్ కెరీర్ లో 30 వ సినిమా గా రూపొందబోయో సినిమా విషయంలో త్రివిక్రం కి ఖచ్చితంగా ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయట. ఇప్పటికే ఎన్.టి.ఆర్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ లా ఉండాలని త్రివిక్రం ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నప్పటికి ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా వచ్చే క్రేజ్ ని త్రివిక్రం నిలబెట్టగలడా అంటూ చర్చించుకుంటున్నారట.  

 

అయితే స్క్రిప్ట్ పాన్ ఇండియా రేంజ్ లో మార్చినప్పటికి ఆర్.ఆర్.ఆర్ తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎన్.టి.ఆర్ కి వచ్చే ఇమేజ్ ని క్రేజ్ ని రెట్టింపు చేసే విధంగా త్రివిక్రం సినిమాని రూపొందించాలి. ఇప్పటి వరకు త్రివిక్రం చేసిన సినిమాలలో కథ పెద్దగా లేకపోయినా మాటలతో మాయ చేసి సక్సస్ కొట్టాడు. కాని ఇప్పుడు ఎన్.టి.ఆర్ సినిమా పెద్ద సవాల్ గా మారిందని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ రేంజ్ ని పెంచే కథ ఉండాలి గాని మాయ చేసే మాటలు కాదు అని అంటున్నారు. మరి త్రివిక్రం ఎలాంటి కథ సిద్దం చేస్తున్నారో..ఎలా తీయబోతున్నారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: