ఇప్పటివరకు మెగా కుటుంబ హీరోల సంఖ్య క్రికెట్ టీమ్ సభ్యుల సంఖ్యకు చేరువగా ఉంది అంటూ కామెంట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు మెగా కాపౌండ్ లో నిర్మాణ సంస్థల సంఖ్య కూడ రానున్న రోజులలో క్రికెట్ టీమ్ సభ్యుల సంఖ్యకు చేరువ అవుతుందా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.
ఇప్పటికే గీత ఆర్ట్స్ అంజన ప్రొడక్షన్స్ బయానర్స్ పై అల్లు అరవింద్ నాగబాబులు మెగా హీరోలతో సినిమాలు తీస్తుంటే ఈ రేస్ లో తాను కూడ ఉన్నాను అంటూ రామ్ చరణ్ కొణిదల ఆర్ట్ ప్రొడక్షన్స్ మొదలుపెట్టి ఇప్పటికే భారీ సినిమాలు తీస్తున్నాడు. వీటికితోడు పవన్ కళ్యాణ్ తన పికె ఆర్ట్స్ బ్యానర్ పై త్వరలో రామ్ చరణ్ తో ఒక భారీ సినిమాను తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇప్పుడు లేటెస్ట్ గా మెగా నిర్మాతల క్రికెట్ టీమ్ లోకి చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా ఎంటర్ అయి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. ‘గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్’ అనే నిర్మాణ సంస్థను రెండు రోజుల క్రితం ప్రారంభించిన సుష్మిత తన తొలి ప్రాజెక్ట్గా వెబ్ సిరీస్ను టేకప్ చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. ‘ఎక్స్ ఛేంజ్ ఆఫ్ ఫైర్’ టైటిల్ తో ఆనంద్ రంగా దర్శకత్వంలో వెబ్ సిరీస్నిర్మాణానికి చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. 2009 లో విడుదలైన ‘ఓయ్’ సినిమాకు ఆనంద్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఈ వెబ్ సిరీస్లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పోలీస్ ఆఫీసర్ గా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ జీ5 యాప్ లో ప్రసారంకానున్నది అని తెలుస్తోంది. ఇప్పటికే సుస్మిత కాస్ట్యూమ్స్ డిజైనర్ గా ‘ఖైదీ నెంబర్ 150’ ‘సైరా’ సినిమాలతో పాటు ‘ఆచార్య’ సినిమాకు కూడ పనిచేస్తోంది. దీనితో మహిళా నిర్మాతగా కూడ మెగా కుటుంబ వారసత్వాన్ని సుస్మిత ఎంత వరకు కొనసాగిస్తుంది అన్న విషయాలు రానున్న రోజులు తెలియచేస్తాయి..