విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకీ లుక్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఇక లాక్ డౌన్ తర్వాత శరవేగంగా నారప్ప ని కంప్లీట్ చేయాలని వెంకీ ప్లాన్ చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత ప్రియమణి ఈ సినిమాతో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తుంది.

 

ఇక ఈ సినిమాకి కొత్త బంగారు లోకం.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. బ్రహ్మోత్సవం చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. కలైపులి ఎస్ థాను, సురేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

 

ఇక వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ ఎఫ్2, వెంకీ మామ వంటి మాస్ హిట్స్ ని అందుకున్నాడు. దీంతో ఈసారి నారప్ప తో బ్లాక్ బస్టర్ అందుకొని హ్యాట్రిక్ హిట్ ని సాధించాలని చూస్తున్నాడు. ఇప్పటికే నారప్ప చాలా వరకు టాకీ పార్ట్ జరుపుకుంది. ఇప్పటి వరకు జరిగిన చిత్రీకరణ బట్టి చిత్ర యూనిట్ సినిమా పక్కా హిట్ అన్న ధీమాతో ఉన్నారట.

 

ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు వెంకీ ఫ్యాన్స్ లోను ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అదే వెంకీ చేయబోయో నెక్స్ట్ సినిమా గురించి. ఇప్పటికే వెంకీ కోసం సూపర్ హిట్ కి సిరీస్ గా దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్3 స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. . అయితే ఇందులో వరుణ్ తేజ్ కూడా ఈ సినిమాకి తోడవ్వాలి. లేదంటే వెంకీ తరుణ్ భాస్కర్ తో సినిమా చేసే అవకాశాలున్నాయట.

 

అలాగే మళయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పన్ కోషియం లో కూడా నటిస్తాడన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విషయంలో చాలామంది హీరోల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ సినిమాలో వెంకటేష్ అయితే కథ కి బాగా సూటవతాడట. అంతేకాదు తెలుగు నేటివిటీకి వెంకీ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు. మరి చూడాలి ఏ సినిమా కమిటవుతాడో. 

మరింత సమాచారం తెలుసుకోండి: