లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా తాజా చిత్రం పుష్ప. ఈ సినిమా సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా. కన్నడ బ్యూటి రష్మిక మందన్న అల్లు అర్జున్ కి జంటగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో అయిదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ కి రంగస్థలం బ్లాక్ బస్టర్.. అల్లు అర్జున్ కి అల వైకుంఠపురములో ఇండస్ట్రీ రికార్డ్ వంటి ట్రాక్ రికార్డ్ ఉండటంతో ఈ సినిమా మీద ఇంకా భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

 

ఇక ఈ సినిమా ప్రారంభం అయినప్పుడే భారీ షెడ్యూల్ ని కేరళ లోని దట్టమైన అడవుల్లో అలాగే కొన్ని కీలక సన్నివేశాలను విదేశాలలో ప్లాన్ చేశారు సుకుమార్. కాని కరోనా కారణంగా ఆ షెడ్యూల్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. అయితే మళ్ళీ ఈ సినిమాని జూలై నుండి సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని సుకుమార్ ప్లాన్ చేశాడు. ఈ నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాలకోసం హైదరాబాద్ లో ఉన్న ఒక స్టూడియోలో ప్రత్యేకంగా ఒక సెట్ ని నిర్మించారట. 

 

అలాగే గతంలో రంగస్థలం సినిమాకి వేసిన విలేజ్ సెట్ ప్లేస్ లో ఫారెస్ట్ సెట్ నిర్మించారని సమాచారం. రంగస్థలం లో వేసిన విలేజ్ సెట్ ఎంత సహజంగా ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే ఫారెస్ట్ సెట్ అంత సహజంగా ఉంటుందా అన్న సందేహాలు చాలామందిలో కలుగుతున్నాయట. కాని సుకుమార్ మాత్రం ఇవన్ని ఆలోచించకుండా సహజత్వం తో కూడుకున్న ఫారెస్ట్ సెట్ లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు వర్షాకాలం మొదలవడంతో ఔట్ డోర్ లో వేసిన ఫారెస్ట్ బ్యాగ్డ్రాప్ లో సీన్స్ చిత్రీకరించడానికి సమస్యలు వచ్చేలా ఉన్నాయని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: