పవర్ స్టార్ మూవీని చాలవేగంగా వర్మ పూర్తి చేస్తున్నాడు. తెలుస్తున్న సమాచారంమేరకు రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక ప్రత్యేకమైన సెట్ లో ఈమూవీ షూటింగ్ ఇప్పటికే దాదాపు 60 శాతం పైగా పూర్తి అయిందని వార్తలు వస్తున్నాయి. వీలైనంత త్వరలో ఈమూవీని రామ్ గోపాల్ వర్మ తన సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ పై విడుదల చేయడానికి వేగంగా పరుగులు తీస్తున్నాడు.


ఇప్పటికే ఈమూవీకి సంబంధించి విడుదల చేసిన స్టిల్స్ వివాదాస్పదంగా మారి పవన్ అభిమానులకు అసహనాన్ని గురి చేస్తున్న విషయం తెలిసిందే. దీనితో పవన్ అభిమానులు రెచ్చిపోయి వర్మను టార్గెట్ చేస్తున్నారు. ఇంత రగడ కొనసాగుతూ ఉన్నా సోషల్ మీడియాలో అనునిత్యం యాక్టివ్ గా ఉండే నాగబాబు ఈమూవీ విషయమై ఎందుకు మౌనం వహించాడు అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు.


ఈమధ్య సినిమా షూటింగ్ లు తిరిగి ప్రారంభించే విషయంలో చిరంజీవి ఏర్పాటు చేసిన సమావేశాలను రాయబారాలను పరోక్షంగా బాలకృష్ణ టార్గెట్ చేసినప్పుడు నాగబాబు విపరీతంగా బాలయ్యను టార్గెట్ చేస్తూ ఓపెన్ కామెంట్స్ చేసాడు. గతంలో శ్రీరెడ్డి వ్యవహారంలో కూడ నాగబాబు ఘాటుగానే సమాధానాలు ఇచ్చాడు. గత ఎన్నికల ముందు బాలకృష్ణ ఎవరో తనకు తెలియదు అంటూ కొన్ని వీడియోలలో కూడ టార్గెట్ చేసాడు.


అయితే ఇప్పుడు వర్మ ఏకంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఏకంగా ఒక వివాదాస్పద సినిమాను తీస్తూ ఆసినిమాకు సంబంధించిన స్టిల్స్ వరసపెట్టి విడుదల చేస్తున్నా నాగబాబు ఎందుకు స్పందించకుండా మౌనంగా ఉంటున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో అదేవిధంగా పవన్ అభిమానుల మధ్య ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి నాగబాబు గత ఎన్నికలలో ‘జనసేన’ తరపున పోటీ చేయడమే కాకుండా అనేకచోట్ల పవన్ కోసం ప్రచారం కూడ చేసాడు. ఆమధ్య నాగబాబు మహాత్మాగాంధీ ని చంపిన గాడ్సే ని పొగుడుతూ నాగబాబు ఒక కామెంట్ చేసాడు. అప్పుడు నాగబాబు కామెంట్స్ కు ‘జనసేన’ కు సంబంధం లేదు అంటూ ఒకప్రకటన కూడ వచ్చింది. ఆవిషయాన్ని సున్నితంగా తీసుకున్న నాగబాబు ఇప్పుడు ఇలా వర్మ పవర్ స్టార్ మూవీ గురించి మౌనం వహించి ఉంటాడా అన్నసందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: