‘సైరా’ తర్వాత సురేంద్ర రెడ్డి తన మూవీ ప్రాజెక్ట్ ను మహేష్ ప్రభాస్ లతో చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసాడు. వారిద్దరు సురేంద్ర రెడ్డి చెప్పిన కథను విన్నారు కాని చివరికి ఎటు తేల్చకుండా కాలం గడిపేశారు. దీనితో సురేంద్ర రెడ్డి గతంలో ఎప్పుడో వ్రాసుకున్న ‘రేసు గుర్రం’ సీక్వెల్ కథను బయటకు తీసి హీరో రామ్ తో చేయాలని అనేక ప్రయత్నాలు చేసాడు.


అయితే రామ్ కూడ ఎలాంటి నిర్ణయాలు చెప్పకుండా ఈకథ పై రోజులు గడుపుతున్న పరిస్థితులలో ఈ కథ నాగచైతన్య వద్దకు వెళితే చైతన్య ఈ కథను అఖిల్ తో తీయమని సురేంద్ర రెడ్డికి సలహా ఇచ్చినట్లు టాక్. ఎప్పటి నుంచో యాక్షన్ మూవీల పై కన్నేసిన అఖిల్ ఇప్పుడు ‘రేసు గుర్రం’ సీక్వెల్ చేయాలని ముచ్చట పడుతుంటే సురేందర్ రెడ్డి మటుకు ఈ విషయంలో ఒక స్థిర నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు అంటూ గాసిప్పులు వస్తున్నాయి.


ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే అఖిల్ లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కు రీ షూట్ తప్పదు అంటూ లీకులు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్య నాగార్జున ఈ మూవీకి సంబంధించిన రఫ్ ఎడిటింగ్ అయిన ఔట్ పుట్ ను చూసి నాగ్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి అమెరికా షెడ్యూల్ తప్ప మిగతా పోర్షన్ మొత్తం బాగాలేదని మళ్ళీ రీ షూట్ చేయమని నాగ్ ఈ మూవీ దర్శకుడుకి సలహాలు ఇచ్చినట్లు టాక్.


దీనితో ఈసినిమాకు సంబంధించి దాదాపు 70 శాతం స్టోరీని మార్చేసి మళ్ళీ కొత్తగా రాస్తున్నారట. ప్రస్తుతం షూటింగ్ లు లేకపోవడంతో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ పని పై బిజీగా ఉన్నట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈ వార్తలే నిజం అయితే మరొకసారి అఖిల్ కు నిరాశ ఎదురైంది అని అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: