దేశంలో కరోనా పరిస్థితి దారుణంగా తయారైంది.  భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 28,637 మందికి కొత్తగా కరోనా సోకింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 551 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. క ఈ మద్య బాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ మద్య విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశాడు.. ఆ షాక్ నుంచి కోలుకోక ముందే బాలీవుడ్ సీనియర్ హీరో రిషి కపూర్ కన్నుమూశారు. 

 


ఈ రెండు విషాదాల నుంచి కోలుకోక ముందే దోనీ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్ పూత్ తన అపార్ట్ మెంట్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ తర్వాత ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూశారు.  ఈ మద్యనే ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూసిన విషయం తెలిసిందే.  ఈ మద్య కరోనా కూడా బాలీవుడ్ లో కూడా వణికిస్తుంది.  తాజాగా బాలీవుడ్ లో వరుసగా కరోనా కేసులతో సతమతమవుతున్నారు. తాజాగా, అనుప‌మ్ ఖేర్ కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

 


ఈ విష‌యాన్ని తెలుపుతూ అనుపమ్ ఖేర్  లో సోషల్ మాద్యమంలో పోస్ట్ చేశారు. తన తల్లి దులారి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోందని, దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ల‌డంతో కరోనా ఉన్న‌ట్లు నిర్ధారణ అయిందని చెప్పారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కరోనా బారినపడడం బీ-టౌన్ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది.  తాజాగా ప్రముఖ నటి రేఖ సెక్యూరిటీ గార్డుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దాంతో ముంబయి మున్సిపల్ అధికారులు రేఖ బంగ్లాకు తాళం వేశారు. అంతేకాదు, కంటైన్మెంట్ జోన్ అంటూ రేఖ ఇంటి బయట బోర్డు కూడా పెట్టారు. కాగా, రేఖ బంగ్లాలోని ఓ పోర్షన్ కు మాత్రమే సీల్ వేశారని ఓ అధికారి చెబుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: