పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన టైం బాగాలేదనిపిస్తుంది. ఆయన సినిమాల మీద కరోనా ప్రభావం తీవ్రంగా దాడి చేస్తుంది. రెండేళ్ళు దాటుతున్నా అజ్ఞాతవాసి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే సేఫ్ జోన్ లో రీ ఎంట్రీ ఇస్తూ బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాని ఎంచుకున్నాడు పవన్ కళ్యాణ్. గతంలో గబ్బర్ సింగ్ లాంటి భారీ సక్సస్ కూడా బాలీవుడ్ నుంచి తీసుకున్న సినిమా ద్వారానే వచ్చింది. అందుకే అదే ఫాలో అయ్యాడు. ఇక ఈ సినిమాకోసం నిర్మాత దిల్ రాజు చాలానే ఖర్చు చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమా అనలేము గాని ఆ రేంజ్ అని చెప్పొచ్చు.

 

నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా కాసేపు శృతిహాసన్ కూడా కనిపిస్తుందని అంటున్నారు. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో పూర్తయి ఉండేది. కాని పరిస్థితులు అనుకూలించలేదు. పవర్ స్టార్ కూడా కాస్త రాజకీయాల్లో అటు ఇటూ తిరుగుతూ బిజీ గా ఉండటం వల్ల అనుకున్న సమయానికి కంప్లీట్ అవలేదు. అయితే ఈ సమస్య ఈ ఒక్క సినిమాకే కాదు ఆ తర్వాత సినిమాల మీద కూడా బాగా పడింది.

 

దీనికి తోడు పవన్ కళ్యాణ్ పక్కన నటించే హీరోయిన్స్ విషయం ఒకటి పీ కె ఫ్యాన్స్ ని బాగా కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. క్రిష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా రూపొందుతుంది. విరూపాక్ష అన్న టైటిల్ అనుకుంటున్నారు. విని విని అందరికీ బాగా అలవాటు కూడా అయిపోయింది. ఇంతలో మరో రెండు టైటిల్ అని వార్తలు వస్తున్నాయి. వాటి సంగతి అలా ఉంచితే ఈ విరూపాక్షలో బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండస్ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. అది కూడా ఫస్టాఫ్ వరకే ఆ హీరోయిన్ ఉంటుందట. సెకండాఫ్ లో క్యారెక్టర్ ని చంపేస్తారట. అంటే హీరోయిన్ కాదు ..ఏదో ఇంపార్టెంట్ రోల్ అని అర్థమవుతుంది. 

 

మరి ఈ సినిమాలో అసలు హీరోయిన్ ఎవరన్నది పూర్తిగా క్లారిటి లేదు. ఇక ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో ఒక సినిమా చేస్తాడు. ప్రస్తుతానికి ఈ సినిమాలు కంప్లీట్ చేస్తే మళ్ళీ రాజకీయాలలోకి వెళ్ళాలని ప్లాన్స్ వేసుకుంటున్నారట. మరి ఈ సినిమాలన్ని కంప్లీట్ కావాలంటే ఖచ్చితంగా నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొనాలి పవర్ స్టార్.      

మరింత సమాచారం తెలుసుకోండి: