బుల్లితెర భామ వర్షిణి ఢీ షోతో బాగా పాపులర్ అయ్యింది. హైపర్ ఆదికి కో టీం లీడర్ గా ఆదితో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండిస్తున్న అమ్మడు ఈమధ్య సూపర్ క్రేజ్ దక్కించుకుంది. మొదట్లో హీరోయిన్ గా ట్రై చేసిన ఈ అమ్మడు స్మాల్ స్క్రీన్ పై కెరియర్ సెట్ చేసుకుంది. రీసెంట్ ఇంటర్వ్యూలో తన కో యాంకర్ విష్ణు ప్రియతో గొడవలపై స్పందించింది అమ్మడు. పోవే పోరా యాంకర్ విష్ణు ప్రియతో మీకు గొడవలు ఉన్నాయా తనతో ఎప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేసుకోరు ఎందుకని వర్షిణిని అడిగితే మామధ్య అలాంటి గొడవలేమి లేవని చెప్పింది వర్షిణి.

 

విష్ణు ప్రియతో తనకు అసలు ఎలాంటి గొడవలు లేవని.. అసలు ఇలాంటి వార్తలు ఎలా పుట్టిస్తారో తెలియదని చెప్పింది వర్షిణి. ఇక యాంకర్స్ కు రేటింగ్ ఇస్తే ఎవరెవరికి ఏ ర్యాంక్ ఇస్తారని అడిగితే మొదటి స్థానంలో సుమ. రెండో స్థానంలో ఝాన్సి, ఆ తర్వాత శ్రీముఖి, రష్మి, అనసూయ పేర్లని చెప్పింది వర్షిణి. ఇక ఆరో స్థానం తనదని చెప్పిన వర్షిణి, విష్ణు ప్రియని మాత్రం చివర స్థానం అన్నది.

 

విష్ణు ప్రియతో గొడవలు లేవంటూనే ఆమెకి చివర స్థానం ఇచ్చింది వర్షిణి. స్మాల్ స్క్రీన్ పై ఈమధ్య హంగామా చేస్తున్న అమ్మడు ఢీ తర్వాత పటాస్ షోలో కూడా తన సత్తా చాటుతుంది. ఇంతకీ వర్షిణి, విష్ణు ప్రియ మధ్య ఏం జరిగింది.. విష్ణు ప్రియకు వర్షిణి ఎందుకు చివరి స్థానం ఇచ్చింది ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం దాటవేసింది వర్షిణి. స్మాల్ స్క్రీన్ పై యాంకరింగ్ చేస్తూనే ఫోటో షూట్స్ తో కూడా అమ్మడు హంగామా చేస్తుంది.                      

మరింత సమాచారం తెలుసుకోండి: