టాలీవుడ్ లో టాప్ సినిమాటోగ్రాఫర్ గా ఉన్న చోటా కె నాయుడు సోదరుడు శ్యాం కె నాయుడు మరో సారి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే శ్యామ్.కె.నాయుడు మీద సినీ నటి శ్రీ సుధా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లు కలిసి ఉన్న తర్వాత ఇప్పుడు తనను కాదంటున్నాడు అంటూ గత ఏడాది సెప్టెంబర్ నెలలో శ్రీ సుధ ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఇప్పుడు ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని తనను శ్యామ్ కె.నాయుడు అలాగే అతని స్నేహితులు బెదిరిస్తున్నారు అంటూ ఆమె మరో సారి ఎస్.ఆర్.నగర్ పోలీసులను ఆశ్రయించింది. 

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే సినీ ఆర్ట్ డైరెక్టర్ చిన్న తనను మాదాపూర్ లోని తన నివాసానికి పిలిచాడని, మాట్లాడాలని పిలవడంతో తను వెళ్లగా అక్కడ ఉన్న స్టిల్ ఫోటోగ్రాఫర్ సాయిరాం మాగంటితో కలిసి తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించారని ఆమె ఫిర్యాదు చేశారు. చిన్న తనను అసభ్య పదజాలంతో కూడా దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్న శ్రీ సుధా వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఆమె ఎస్ ఆర్ నగర్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయగా దానిని మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తున్నట్లు ఎస్.ఆర్.నగర్ పోలీసులు ప్రకటించారు. ఇద్దరమూ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారమె కావడంతో తమ మధ్య పరిచయం ఏర్పడిందని, తను భార్య వల్ల ఇబ్బందులు పడుతున్నా అంటూ తనకు దగ్గరయ్యాడు అని ఆమె గతంలో చెప్పుకొచ్చింది. శ్యాం కె నాయుడుకి భార్యతో గొడవలు ఉన్నాయని వాటిని క్లియర్ చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీ సుధ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: