కుర్ర హీరో నాగశౌర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ కుర్రహీరో మరే హీరో చేయనంత సాహసం చేయడానికి సిద్ధం అయ్యాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా నాగ శౌర్య దర్శకుడు రాజేంద్రతో కలిసి పోలీసు వారి హెచ్చరిక అనే సినిమా ప్రకటించాడు. ఈ సినిమా ప్రకటించినప్పుడు రెండు సార్లు ఆగిన సినిమాని వదలకుండా నాగశౌర్య రిస్కు చేస్తున్నారంటూ కొంతమంది వ్యాఖ్యానించారు. ఇప్పుడు అంతకు మించిన రిస్క్ చేస్తున్నాడు అనే వాదన వినిపిస్తోంది. అదేంటంటే నాగశౌర్య ఒకే ఏడాదిలో 5 సినిమాల రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు అని అంటున్నారు. 


ప్రస్తుతానికి ఆయన లక్ష్య, అలాగే వరుడు కావలెను అనే సినిమాలు చేస్తున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విలు విద్య నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇక లక్ష్మీ ప్రసన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరుడు కావలెను అనే సినిమాకు ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతొండి. ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు ఈయన రాజేంద్రతో కలిసి పోలీసువారి హెచ్చరిక అనే మరో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.


ఈ సినిమాలు కాకుండా నాగశౌర్య శ్రీదేవి మూవీస్ వారితో ఒక సినిమా సైన్ చేశాడు అని అంటున్నాడు. ఈ  నాలుగు సినిమాలు కాకుండా ఆయన మరో సినిమా కూడా చర్చల దశలో ఉందని చెబుతున్నారు. ఈ సినిమాల షూటింగ్స్ అన్ని పూర్తి చేసి ఒకే ఏడాదిలో వరుసగా సినిమాలు రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడని ప్రచారం జోరుగా సాగుతోంది. నిజానికి ఇలాంటి రిస్కులు గతంలో బాలకృష్ణ చిరంజీవి లాంటి హీరోలు మాత్రమే చేసేవారు. కానీ ప్రస్తుతానికి మార్కెట్ కూడా సరిగా లేని నాగశౌర్య చేయటం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారింది అని మాత్రం చెప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: