బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వరుణ్ ధావన్ తన చిరకాల ప్రేయసి నటాషా దలాల్ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇప్పటికే తెలిసిన విషయమే .ఐదు రోజుల పెళ్లి అనే మాటకు కాలం చెల్లిపోయినా ఇంకా సంపన్న వర్గాల్లో మాత్రం ఇది కనిపిస్తూనే ఉంది. తాజాగా మూడు రోజుల పెళ్లి ముచ్చట వైరల్ అవుతోంది. అది మరెవరిదో కాదు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ పెళ్లి. ఈ క్రమంలో సడెన్గా ఈ నెల 24న పెళ్లి ముహుర్తం ఖరారయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుల ద్వారా తెలిసింది ఏంటంటే.. ‘‘ఈ నెల 24 ఆదివారం నాడు అలీబాగ్లో వరుణ్ ధావన్ వివాహం జరగనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే ఈ పెళ్లి వేడుకకి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు. ఇక ఈ నెల 22 నుంచి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
పెళ్లి ఘనంగా అంటే తండోపతండాలుగా బంధుమిత్రులను ఆహ్వానించి కాదట.. పరిమితంగా అతిథులు హాజరవబోతున్నారు. ప్రధానంగా 50 మంది సినీ సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. వీరిలో కరణ్ జోహార్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, శిల్పాశెట్టి, రెమో డిసౌజా, శశాంక్ కైతాన్, రాజ్ కుంద్రా లాంటి వారున్నారు.మొత్తానికి 2021 వరుణ్ ధావన్ వివాహంతో ప్రారంభం అవుతుంది. ఇక ఎంతమంది వీరి బాటలో నడుస్తారో చూడాలి. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుణ్ ‘జగ్ జగ్ జీయో’ చిత్రంలో నటిస్తున్నారు. అనిల్ కపూర్, నీతూ కపూర్, కియారా అద్వానీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.