స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ఇద్దరూ కలిసి చేస్తోన్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. అయితే ఈ సినిమాను ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలను హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ చేసి, తమ సత్తా ఏంటో చూపారు తెలుగు ఇండస్ట్రీ హీరోలు. ఇక అదే బాటలో అల్లు అర్జున్ కూడా నడవబోతున్నాడు. తను కూడా హాలీవుడ్ రేంజ్ లో తన సత్తాను చాటడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంతవరకు కనీ వినీ ఎరుగని స్థాయిలో పుష్ప సినిమా ఉండబోతోందని ప్రేక్షకులు ఎదురుచూసేలా సుకుమారుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా అన్ని భాషల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్లో తన సత్తా ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు అల్లు అర్జున్. ఇక పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కబోతున్న పుష్ప సినిమా ఇక  పాన్ ఇండియా మార్కెట్ ను బద్దలు కొట్టడానికి పుష్ప సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.

అందుకే సినిమా మేకింగ్ చేసేటప్పుడు ఎంతో ప్రాముఖ్యమైన జాగ్రత్తలు వహిస్తూ,ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సన్నివేశాలను తీస్తున్నట్లు  సమాచారం. అయితే కరోనాలో లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే లాక్ డౌన్ తీసేసిన తరువాత మరోసారి రేస్  లోకి ప్రవేశించింది పుష్ప. ముఖ్యంగా అడవుల్లో స్టంట్లు చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసినట్లు సమాచారం. దీనికోసం టాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ తో  సినిమా యూనిట్  జాయిన్ అయినట్లు  వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఇక అందుకోసమే మరో వైపు ఈ సినిమాను మేకర్స్ ఐదు భాషల్లో విడుదలకు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. తెలుగు, తమిళ,కన్నడ,మలయాళం,హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలకాబోతోంది. మరో రెండు భాషలను కలుపుకొని మొత్తం ఏడు భాషలలో ఈ సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఇక ఈ సినిమాకు రష్మిక మందన స్పెషల్ అట్రాక్షన్ గా ఉండబోతోంది


మరింత సమాచారం తెలుసుకోండి: