టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా చెలామణి అవుతున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫుల్ బిజీగా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావట్లేదనే విమర్శలను కూడా ఎదుర్కొంది రకుల్. ఈ విషయం కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పి చాలా హర్ట్ అయ్యింది. అందుకే టాలీవుడ్ లోనూ సినిమాల జోరును పెంచింది. విశ్వనటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కిచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనితో పాటుగా క్రిష్ దర్శకత్వంలో‘కొండపొలం’ అనే సినిమాలో కూడా రకుల్ హీరోయిన్ గా అవకాశాన్ని కొట్టేసింది.
ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో రకుల్ డీ గ్లామర్ రోల్ లో కనిపించబోతోంది. ఎప్పుడు హాట్ హాట్ పాత్రల్లోనే కనిపించే ఈ బ్యూటీ ఇందులో పూర్తిగా నటనకే ప్రాధాన్యతనిచ్చి ఈ సినిమాకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. దీనితో పాటుగా తమిళం, హిందీ లోనూ పలు సినిమాల్లో రకుల్ నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ కోలీవుడ్  హీరోతో ఒప్పందం కుదుర్చుకున్నానని ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెళ్లడించింది. ‘అయలాన్’ మూవీ  గురించి రకుల్ ప్రస్తావించింది. శివ కార్తికేయన్ తో  ‘అయలాన్’ తో రకుల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది.

‘ప్రస్తుతం ఈ అయలాన్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టే. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమాలో నటించడం ద్వారా శివకార్తికేయన్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో నాకు ఆయన ఎంతో సహాయం చేసేవారు. సెట్ లో మేము జోక్స్ వేసుకుంటూ సరదాగా గడిపేవాళ్లం. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకే మా మధ్యన ఒక ఒప్పందం కూడా కుదిరింది. అదేంటో తెలుసా.. సెట్ లో ఉన్నంత సేపు శివకార్తికేయన్ నాతో కేవలం ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి.. అలాగే నేనేమో అతనితో తమిళంలోనే మాట్లాడాలి’ అంటూ మేము ఒప్పందం కుదుర్చుకున్నామని రకుల్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: