ప్రముఖ బిజినెస్ మెన్ మరియు మ్యాంగోస్ అధినేత రామ్ వీరపనేనితో తెలుగు పాపులర్ సింగర్ సునీతకు రెండవ వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి అతి కొద్ది మంది సెలెబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. నితిన్, సుమ ,రేణూ దేశాయ్ ,దిల్ రాజు వంటి వారు కొందరు ఆ వేడుకలో పాల్గొన్నారు. సునీతకు శుభాకాంక్షలు తెలియజేశారు..ఆమె సెకండ్ మ్యారేజ్ పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ సాగింది. కొందరు ఆమె వివాహాన్ని సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకించారు. ఈ డిస్కషన్ ఇటు కొనసాగుతున్నా కానీ ఇవన్నీ ఏం పట్టించుకోకుండా సునీత తన కొత్త జీవితాన్ని ఎంతో ఆనందంగా కొనసాగిస్తున్నట్లుగా కనిపిస్తోంది..

 అయితే.. పెళ్లి తర్వాత కూడా సునీత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. జీవితం ఎంతో ఆనందంగా ఉందంటూ మంచి మంచి కొటేషన్లు చెబుతోంది.తన లేటెస్ట్ పిక్స్ మరిన్ని షేర్ చేసింది. ఈ ఫొటోలతోపాటు వీటికి ఆమె రాసిన క్యాప్షన్స్ కూడా వైరల్ అవుతున్నాయి.కొత్త జీవితం చాలా ఆనందంగా ఉందన్న విషయం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా.. కాఫీ తాగుతున్న ఫొటోను షేర్ చేసిన సునీత.. ఇంటి గార్డెన్లో మొక్కల మధ్య నడుస్తున్న ఫొటోలు కూడా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫొటోలు చాలా క్యూట్ గా ఉన్నాయి.

 వీటికి మంచి క్యాప్షన్ కూడా రాశారు. 'సంతోషంగా ఉండేందుకు.. మంచి పనులు చేసేందుకు.. ఆలస్యం చేయడమనేదే ఉండదు' అంటూ రాసుకొచ్చింది సునీత..ప్రస్తుతం తన సోషల్ మీడియాలో సునీత పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.. ఇక మరోవైపు ఈ జంట త్వరలోనే హనీమూన్ కి వెళ్లబోతున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇదే విషయాన్ని సునీత ఇటీవల మీడియా తో మాట్లాడుతూ.."హనీమూన్ కోసం మేము మాల్దీవులకు వెళ్ళబోతున్నామని అంటున్నారు, గాసిప్స్ కూడా వచ్చాయి. ఒక్కటి అయితే నిజం మా హానీమూన్ కోసం మంచి ప్లేస్‌కి ఎక్కడికైనా వెళ్తాం' అని చెప్పుకొచ్చింది సునీత...!!

మరింత సమాచారం తెలుసుకోండి: