సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కసారిగా జోరు పెంచేశారు. గత ఏడాది కరోనా తో టాలీవుడ్ పూర్తిగా ఇంటికే పరిమితమైన వేళ సూపర్ స్టార్ కూడా తన కొత్త సినిమా షూటింగ్ ని వాయిదా వేసుకున్నారు. క్రిష్ణ జన్మ దినం రోజున సర్కార్ వారి పాట అంటూ బిగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చేసిన  మహేష్ బాబు ఆ తరువాత సైలెంట్ అయ్యాడు.

ఇక మహేష్ బాబు కొత్త సినిమా కధ ప్రకారం  షూటింగ్ మేజర్ పార్ట్ అంతా అమెరికాలోనే షూట్ చేయాల్సి ఉంది. దాంతో అమెరికాలో కరోనా సెకండ్ వేవ్ కూడా భారీ ఎత్తున ఉండడంతో ఎంత సేపు ఎదురుచూసినా వీలు కాలేదు. ఇక లాభం లేదు అనుకుని మహేష్ బాబు లొకేషన్ మొత్తం చేంజ్ చేశేశారు. దుబాయ్ లో సర్కార్ వారి పాట మొదలుపెట్టారు.

ఈ నెల 25 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలై నెల రోజుల పాటు నాన్ స్టాప్ గా దుబాయ్ లో జరుగుతుంది అంటున్నారు. ఆ తరువాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయి రామోజీ ఫిల్మ్ సిటీలో మిగిలిన షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసుకుంటుందని టాక్. ఇక సాంగ్స్ బ్యాలెన్స్ ఉంటే వాటిని ఈ ఇయర్ సెకండ్ టెర్మ్ లో పూర్తి చేసి మొత్తం బొమ్మను దసరాకు ముస్తాబు చేస్తారు అంటున్నారు.

జోరుగా షూటింగ్ జరగబోతోంది అని చెబుతున్నా ఈ మూవీ కచ్చితనా దసరాకు రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఈ మూవీని గీతాగోవిందం ఫేమ్ పరశురాం డైరెక్ట్ చేస్తున్నారు. కీర్తీ సురెష్ మహేష్ బాబు పక్కన హీరోయిన్. మొత్తానికి ఈ మూవీని కావాల్సిన అన్ని హంగులూ ఉన్నాయని అంటున్నారు. దసరాకు ఈ బొమ్మ పడితే కేక అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు తరువాత మరో కొత్త పండుగ మహేష్ తెస్తాడు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: