'సత్య' 'కంపెనీ' వంటి సినిమాలలో అండర్ వరల్డ్ మాఫియా గురించి కళ్లకు కట్టినట్లు చూపించాడు వర్మ. ఇప్పుడు ముంబైకి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో 'డి-కంపెనీ' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ‘డీ కంపెనీ’ వెబ్ సిరీస్ ట్రైలర్ శనివారం విడుదలైంది. ఒక చిన్న గ్యాంగ్ లీడర్ నుంచి పెద్ద గ్యాంగ్ స్టర్గా ఎలా మారాడు అన్న నేపథ్యంలో ‘డీ కంపెనీ’ తెరకెక్కుతుంది. ఈ మూవీ గ్యాంగ్ స్టర్ సినిమాల అన్నింటికి మదర్ లాంటిది అని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.‘డీ కంపెనీ’ ని మహా భారతంతో పోలుస్తూ.. మహాభారత్ ఇన్ అండర్ వరల్డ్ అని క్యాప్షన్ ఇచ్చాడు.
తన గత సినిమాల మాదిరే బ్యాక్గ్రౌండ్మ్యూజిక్తో చింపేశాడు ఆర్జీవీ. ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం బీజీఎంతో స్టోరీ ఏంటో తెలియజేస్తూ చివరల్లో ఒకే ఒక డైలాగ్తో టీజర్ని ముగించేశాడు.ఈ సిరీస్ లో 1993 ముంబై బాంబు పేలుళ్ల గురించి.. డి-కంపెనీ నీడలో బ్రతికిన ఇతర గ్యాంగ్ స్టర్ల గురించి తెలియజేయనుంది.ఒక వీధి ముఠాను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్గా దావూద్ ఎలా మార్చారనేదే ‘డీ కంపెనీ’ కథ అని ఆర్జీవీ పేర్కొన్నారు. స్పార్క్ కంపెనీ అధినేత స్పార్క్ సాగర్ నిర్మిస్తున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.వర్మ తీస్తున్న ఈ కంపెనీ సిరీస్ ఐదు భాషల్లో త్వరలోనే ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది.మరి ఈ ఇది ఎలాంటి వివాదాలకు తెర లేపుతుందో చూడాలి .