మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజున మంచు మనోజ్ చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆశలు రేపుతోంది. తన స్నేహితుడు, తోటి హీరో సాయి ధరమ్ తేజ్‌ కి కాస్త స్పెషల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర పోస్ట్ చేశాడు మంచు మనోజ్. ఈ మేరకు తన స్నేహితుడి తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ గా ఉన్నానని చెప్పాడు. 1982 లో చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన సూపర్ హిట్ మల్టీస్టారర్ `బిల్లా రంగా` మూవీ అక్టోబర్ 15తో 38 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.


దీంతో సాయి ధరమ్ తేజ్‌కి బర్త్ డే విషెస్ చెబుతూ ఇద్దరం కలిసి ఈ సినిమా రీమేక్ చేద్దామనే ప్రతిపాదన పెట్టాడు మనోజ్. '' ఓ వైపు నీ పుట్టినరోజు. . మరోవైపు బిల్లా రంగా సినిమా 38 సంవత్సరాలు పూర్తి. ఈ రెండూ కాకతాళీయమే అయినా. . ఇది మనకు ఏదో చెబుతోందని అనుకుంటున్నా బాబాయ్. నేను రెడీ. . నువ్వు రెడీయా'' అని మనోజ్ ఇన్స్టా లో పోస్ట్ చేసాడు. మనోజ్ ట్వీట్ పై జనాలు ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. ''క్రేజీ కాంబినేషన్, సూపర్, మీ ఇద్దరినీ ఒకే తెరపై చూడాలని కుతూహలంగా ఉంది, మేమూ రెడీ'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


దీంతో మంచు మనోజ్ పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. చూడాలి మరి మనోజ్ ప్రతిపాదనపై మెగా మేనల్లుడు ఎలా రియాక్ట్ అవుతాడనేది !. ఇకపోతే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో బిజీగా ఉన్నాడు. అతి త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.నిజంగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఈ మూవీ వస్తే మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: