తన సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ కోసం వెతుకుతున్నారు అని తెలుసుకున్న మాయగాళ్లు.. అతనికి మాయ మాటలు చెప్పి ప్రణీత వాళ్ళు చెప్పిన మాట వింటుందని నమ్మపలికారు. ఆమె మినిమం 20 లక్షలు తీసుకుంటుందని చెప్పారు. అది నిజమని నమ్మిన బిజినెస్ మెన్ ఆ ఇద్దరు చెప్పింది నిజమా ? కాదా ? అన్న విషయాన్ని తెలుసుకోకుండా 13. 5 లక్షలు ఇచ్చారు.. ఆ డబ్బులను తీసుకొని పరార్అయ్యారు.బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రముఖ హోటల్ గదిలో హీరోయిన్ ప్రణీత ఉందని, అక్కడికి వచ్చి ఆమెతో డీల్ సెట్ చేసుకోండని బిల్డర్ని నమ్మించి నట్టెట్లో ముంచేసారు.
హోటల్ గది లో ప్రణీత ఉందని చెప్పి హోటల్ కు పంపించారు.గంటకు పైగా వెయిట్ చేసిన ఆ బిల్డర్.. ఆ ఇద్దరికీ ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చాయి. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించి బెంగుళూరు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘరానా మోసం బయటపడింది. తన స్నేహితుడు ప్రశాంత్ అనే వ్యక్తి ద్వారా జనాయత్, వర్షా పరిచయం అయ్యారని, వారిద్దరూ ఇలా మోసం చేస్తారని అసలు అనుకోలేదని మరొక బిల్డర్ చెప్పుకొచ్చాడు.ఇలా నమ్మించి మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది నమ్మి మోసపోవద్దని ప్రజలకు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయం పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..