బిగ్ బాస్ హౌజ్ లో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న కంటెస్టెంట్లు అంతా కలసి కన్నీటిపర్యంతం అయ్యారు. వారి ఏడుపులతో హౌజ్ లో ఒకరకమైన వాతావరణం ఏర్పడింది. చూసే ఆడియన్స్ కి కూడా అది షాకింగ్ లాంటిదే మరి. ఇంతకీ ఎందుకు కంటెస్టెంట్లు అలా అయ్యారు. వారు ఎమోషన్ వెనక ఉన్న రీజనేంటి. అంటే చాలానే ఉంది. బిగ్ బాస్ ఒక టాస్క్ లాంటిదే ఇచ్చాడు. వారి ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు పంపించి వారి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘటనలు చెప్పమన్నాడు.

దాంతో ఒక్కొక్క కంటెస్టెంట్ తాము జీవితంలో ఎంతటి కష్టం ఎదుర్కొన్నామో చెబుతూ బాగా ఎమోషన్ అయ్యరు. కన్నీళ్ళు పెట్టుకున్నారు. తన తల్లి గురించి చెబుతూ అమ్మ రాజశేఖర్  ఏడిచేశారు. హారిక తన తండ్రి  తల్లి గురించి చెబుతూ తమ కుటుంబంలో  వచ్చిన కొన్ని సమస్యలు ప్రస్తావిస్తూ ఏడుపు లంకించుకున్నారు. మరో కంటెస్టెంట్ లాస్య అయితే తన కుటుంబం గురించి ఎవరికీ తెలియని విషయాలు అంటూ చెప్పుకొచ్చారు. తన తండ్రికి జరిగిన యాక్సిడెంట్ గురించి ఆమె చెబుతున్నపుడు హౌజ్ అంతా కన్నీరు పెట్టుకుంది.

అలాగే మోనాల్ గజ్జల్ కూడా తన తండ్రి గురించి  చెబుతూ ఏడుస్తూనే ఉంది. ఇక అరియానా తన కుటుంబం గురించి చెబుతూ తన అసలు పేరు అర్చన అని చెప్పింది. తన తల్లి,తండ్రి మధ్య విభేధాలు రావడంతో తన తల్లి ఎలా పెంచింది, తాను ఎలా కష్టపడి ఈ స్థితికి చేరుకున్నాను అని వివరించడంతో హౌజ్ మేట్స్ ఆమెతో పాటే కన్నీరు పెట్టారు.  అలాగే మహబూబ్ తన చదువు కోసం మొత్తం కుటుంబం పడిన కష్టాలు చెబుతున్నపుడు కూడా అంతా బాధపడ్డారు. మొత్తానికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కాదు కానీ హౌజ్ అంతా కన్నీటితో తడిసి ముద్దయింది. మొత్తానికి ఫ్యామిలీ ఫోటోలతో  కంటెస్టెంట్లకు ఇంటి బెంగ పెట్టేశాడు బిగ్ బాస్.





మరింత సమాచారం తెలుసుకోండి: