తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోలు అందరు ఒకేచోట కలవడం చాల అరుదుగా చూస్తుంటాం. హీరోలందరిని సినీ ఉత్సవాలు జరిగే సమయంలోను లేదా.. ఇండస్ట్రీలో ఎన్నికలు జరిగినప్పుడు లేదా.. సినీ ప్రముఖుల ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు లేదా.. సినీ పరిశ్రమకు సంబంధించిన ఏదైనా వేడుకలో పాల్గొన్నప్పుడు తప్ప మరి మిగతా సందర్భాలలో ఎక్కవగా కనిపించారు. ఇక స్టార్ హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక స్టార్ హీరోలంతా కలిసి దిగిన ఫోటోలు గూగుల్ సెర్చ్ చేస్తే కొన్ని మాత్రమే దొరుకుతాయి.

అయితే ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు వేరే హీరోని సినిమా ఈవెంట్స్ కి పిలిచి సినీ పరిశ్రమకు సరికొత్త ట్రెండ్ ని తీసుకొస్తున్నారు. ఇక స్టార్ హీరోలు ఒక్క ఫొటోలో కనిపిస్తేనే అభిమానులకు కన్నుల పండగ. అలాంటిది స్టార్ హీరోలు ఒకే స్టేజీపై కనపడితే వారి ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఒక్కపుడు స్టార్ హీరోలంతా రోజు కలుసుకుంటూ ఉండేవారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సూపర్ స్టార్ మహేష్ బాబు - యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి ఉన్న ఓ త్రో బ్యాక్ పిక్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ఇక అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ఎంత సూపర్ హీట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా నేటికీ 16 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాను పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో సోనాలి హీరోయిన్ గాబింద్రే, శ్రీకాంత్, గిరీష్ కర్నాడ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ చిత్ర యూనిట్ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో చిరంజీవి, మహేష్, ప్రభాస్, తరుణ్, శ్రీకాంత్, సుమంత్ కనిపిస్తున్నారు. వీరితో పాటు ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ జయంత్ సి. పరాన్జీ కూడా ఉన్నారు. ఇక ఈ ఫోటోను చుసిన నెటిజన్స్ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: