తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోల కుటుంబాలలో మెహన్ బాబు కుటుంబం ఒక్కటి. ఆయన తన కెరీర్ లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. కానీ అతని కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ కెరీర్ పరంగా మంచి విజయాన్ని సాధించలేకపోయారు. అయితే మనోజ్ మాత్రం టాలీవుడ్ హీరోలతో సరదా కలివిడిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. ఇక మనోజ్ అతిధి పాత్రలను ఏ మాత్రం మొహమాటం లేకుండా చేస్తుంటాడు.

తెలుగు పరిశ్రమలో మల్టీ స్టార్స్ చేయడం మనోజ్ కి ఆసక్తిగా ఉంది. తాజాగా ఈ మల్టీస్టారర్ పై మంచు మనోజ్ ట్వీట్ చేయడం ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా మెగా హీరో సాయితేజ్, మంచు హీరో మనోజ్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఈ రోజు (గురువారం) సాయితేజ్ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా మనోజ్ సోషల్ మీడియా ఖాతా ద్వారా సాయితేజ్‌కు విషెస్ తెలియజేశాడు. గతంలో చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన `బిల్లా రంగా` రీమేక్ చేద్దామని ప్రతిపాదించాడు.



బిల్లా రంగా చిత్ర గురించి చెప్పాలంటే.. ఈ సినిమాలో చిరంజీవి, మోహన్ బాబు తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. కే.యస్.ఆర్.దాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పింజల నాగేశ్వరరావు తెరకెక్కించారు.ఇక అప్పట్లో ఈ సినిమా పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ చిత్రం అప్పటి వరకు ఉన్న యాక్షన్ చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టించింది. ఇక ‘బిల్లా రంగా’ రీమేక్ విషయమై కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఈ రీమేక్ విషయమై చర్చలు నడుస్తూనే ఉన్నాయి.  తాజాగా ఈ సూపర్ హిట్ సినిమా రీమేక్ చేస్తే..  చూడాలనకునే ప్రేక్షకులు ఉన్నారు. మొత్తానికి మెగా హీరోను ఒప్పించి ‘బిల్లా రంగా’ రీమేక్‌ను మంచు మనోజ్ పట్టాలెక్కిస్తాడా లేదా అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: