తెలుగు ఇండస్ట్రీలోకి వర్షం సినిమాతో అడుగు పెట్టిన హీరోయిన్ త్రిష. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ హీరోయిన్ త్రిష పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అతి త్వరలోనే బాలీవుడ్ హీరో శింబుతో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని పెళ్లి చేసుకునేందుకు కూడా సీక్రెట్ గా ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా హీరో శింబూ సోషల్ మీడియాలో డిసెంబర్ లో మీకు ఒక శుభవార్త చెప్తాను అంటూ ప్రకటన చేయడం జరిగింది . ఇక మరో వైపు అటు త్రిష గాని, ఇటు శింబు కానీ తమ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న కానీ వారు ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో పెళ్లి వార్త మరింత బలం చేకూరింది.

 తాజాగా తమిళ నిర్మాతల మండలి ఎన్నికల విషయంపై శింబు తండ్రి టి.రాజేందర్ మీడియాతో సమావేశం చేయగా....ఒక మీడియా ప్రతినిధి త్రిష, శింబు పెళ్లి వార్తలు నిజమేనా అని ప్రశ్నించగా శింబు తండ్రి టి.రాజేందర్ మౌనంగా ఉండటంతో జనాల్లో ఈ అంశం చాలా చర్చనీయంగా మారింది. ఇక వీరిద్దరూ డిసెంబర్ నెలలో ఒకటి కాబోతున్నారని అందుకోసం ఇప్పటికే ముందస్తు కార్యక్రమాలు మొదలు పెట్టారని వార్త వస్తుంది.  


ఆ మధ్య కాలంలో హీరోయిన్ త్రిష పెళ్లికి సిద్ధమై ప్రముఖ వ్యాపారవేత్త అయిన వరుణ్ ను ఎంగేజ్మెంట్ చేసుకొని అతనితో కలిసి ఒక స్పెషల్ ఫ్లైట్ లో విహారయాత్ర కూడా చేసింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏమయిందో తెలియదు కానీ... ఆ పెళ్లి ఆగిపోవడం సస్పెన్స్ గానే ఉండిపోయింది. ఇక శింబు, త్రిష జంటగా 'విన్నైతాండి వరువాయ' (ఏమాయ చేశావే తమిళ వెర్షన్‌), అలై సినిమాలలో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అనంతరం వారిద్దరూ కూడా మంచి స్నేహితులుగా ఉంటమని ప్రకటించిన ఈ జోడి ఇప్పడూ పెళ్లి చేసుకోవడం తమిళ ఫిలిం ఇండస్ట్రీలో ఆసక్తికర అంశం అయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: