తాజాగా తమిళ నిర్మాతల మండలి ఎన్నికల విషయంపై శింబు తండ్రి టి.రాజేందర్ మీడియాతో సమావేశం చేయగా....ఒక మీడియా ప్రతినిధి త్రిష, శింబు పెళ్లి వార్తలు నిజమేనా అని ప్రశ్నించగా శింబు తండ్రి టి.రాజేందర్ మౌనంగా ఉండటంతో జనాల్లో ఈ అంశం చాలా చర్చనీయంగా మారింది. ఇక వీరిద్దరూ డిసెంబర్ నెలలో ఒకటి కాబోతున్నారని అందుకోసం ఇప్పటికే ముందస్తు కార్యక్రమాలు మొదలు పెట్టారని వార్త వస్తుంది.
ఆ మధ్య కాలంలో హీరోయిన్ త్రిష పెళ్లికి సిద్ధమై ప్రముఖ వ్యాపారవేత్త అయిన వరుణ్ ను ఎంగేజ్మెంట్ చేసుకొని అతనితో కలిసి ఒక స్పెషల్ ఫ్లైట్ లో విహారయాత్ర కూడా చేసింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏమయిందో తెలియదు కానీ... ఆ పెళ్లి ఆగిపోవడం సస్పెన్స్ గానే ఉండిపోయింది. ఇక శింబు, త్రిష జంటగా 'విన్నైతాండి వరువాయ' (ఏమాయ చేశావే తమిళ వెర్షన్), అలై సినిమాలలో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అనంతరం వారిద్దరూ కూడా మంచి స్నేహితులుగా ఉంటమని ప్రకటించిన ఈ జోడి ఇప్పడూ పెళ్లి చేసుకోవడం తమిళ ఫిలిం ఇండస్ట్రీలో ఆసక్తికర అంశం అయింది.