యాంకర్ లాస్య.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎన్నో షో లలో యాంకర్ గా చేసింది. ముఖ్యంగా రవితో స్టేజ్ ను పంచుకుంది. ఇవన్నీ కూడా ఆమెకు పేరును తీసుకొచ్చాయి. అలా స్టార్ యాంకర్ గా బుల్లి తెరపై అలరిస్తుంది.ప్రస్తుతం ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 4 లో అడుగుపెట్టి త‌న ఆట, మాట ‌తీరుతో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతోంది. 40 రోజులుగా రసవత్తరంగా సాగిపోతున్న ఈ షోలో నిన్నటి ఎపిసోడ్ ఎమోషనల్‌గా సాగిపోయింది..తమ పర్సనల్ లైఫ్ లో జరిగిన కొన్న కీలక సంఘటనలను అందరూ గుర్తు చేసుకున్నారు.




ఈ నేపథ్యంలో యాంకర్ లాస్య తన జీవితంలో జరిగిన మంచి, చెడులను గురించి బయటపెట్టి ఎమోషన్ అయ్యింది.మంజునాథ్ ను రెండు సార్లు పెళ్ళి చేసుకున్నాట్లు తెలిపింది. మొదటి సారి చేసుకున్నప్పుడు అందరూ తనను అసహ్యించుకోవడం తో పాటుగా దూరం పెట్టినట్లు తెలిపింది.పెళ్లయ్యాక ఏడేళ్లకు మరోసారి కుటుంబ సభ్యుల సమక్షంలో తన భర్తనే రెండోసారి పెళ్లి చేసుకున్నానని చెబుతూ ఓపెన్ అయిందట..తన తండ్రికి రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు మొద‌టిసారి అప్పు చేశానని, ల‌క్షా 50 వేలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో అంద‌రి ద‌గ్గ‌రా అడిగి ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చింది లాస్య..



ఆ డబ్బుకోసం చాలా మందిని అడిగాను ఎవరు ఇవ్వలేదు.. చివరికి నా భర్త ఆ ఎమౌంట్ ను సర్దారు.దాంతో ఇప్పుడు వారందరి తనని కొడుకు లాగా అభిమానిస్తున్నారు.తన తండ్రి ఆయన్ను ఓ కొడుకుగా ట్రీట్ చేశారని లాస్య చెప్పింది. ఇష్టం లేని పెళ్లి చేసుకోవ‌డం వ‌ల్ల తమను దూరం పెట్టిన తల్లిదండ్రులు అలా దగ్గరై ఇప్పుడు తన కొడుకు ఆలనా పాలనా చూసుకుంటున్నారని చెబుతూ కన్నీరు పెట్టుకుంది. ఓర్పు అమ్మ దగ్గర, కోపం నాన్న దగ్గర నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చింది. ఈ విషయం ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: