బాలకృష్ణ నటించే సినిమాలకు మంచి కథలు మంచి దర్శకులు దొరకడం ఎంత కష్టంగా ఉందో అతడి సినిమాలో హీరోయిన్ పాత్రకు గ్లామర్ బ్యూటీలను ఎంపిక చేయడం కూడ మరింత కష్టంగా మారిపోయింది. ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్ అయిన తరువాత బాలయ్యలోని జోష్ అంతా తగ్గిపాయింది.


దీనితో ఒక సరైన హిట్ కోసం బాలకృష్ణ ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో చేస్తున్న మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. కరోనా పరిస్థితులు ఎదురవకుండా ఉండి ఉంటే ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయి ఉండేది. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ ప్రారంభించాలి అని ప్రయత్నాలు చేస్తున్న దర్శకుడు బోయపాటి టెన్షన్ కు మళయాళ బ్యూటి ప్రగ్యా మార్టిన్ నిర్ణయంతో పరిష్కారం దొరికినట్లు వార్తలు వస్తున్నాయి.


ఈమూవీ కథ రీత్యా హీరోయిన్ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉండటమే కాకుండా ఈమూవీలో హీరోయిన్ చాల గ్లామర్ గా చలాకీగా కనిపించాలి. దీనితో బోయపాటి అనేకమంది క్రేజీ హీరోయిన్స్ ను సంప్రదించి భారీ పారితోషికం ఆఫర్ చేసినా వారంతా బాలయ్య పేరు చెప్పగానే వెనకడుగు వేసినట్లు లీకులు వచ్చాయి. దీనితో టెన్షన్ పడిపోతున్న బోయాపాటికి ప్రగ్నా మార్టిన్ దేవతలా మారింది.


‘ఓరు మురై వంతు పార్థాయ’ అనే మళయాళ సినిమాలో పార్వతి పాత్రలో నటించిన ఈ మళయాళ బ్యూటీ నటిగా మంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా అనేక అవార్డులను కూడ పొందింది. ప్రస్తుతం ఈమె గౌతమ్ మీనన్ అంథాలజీ ప్రాజెక్టు లో నటిస్తోంది. బాలకృష్ణ కరోనా భయాలు పక్కకు పెట్టి కనీసం వచ్చే నెల నుండి అయినా ఈమూవీ షూటింగ్ స్పాట్ కు రాగలిగితే ఈమూవీని వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ కు తీసుకురావాలని బోయపాటి చాల గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మూవీలో బాలకృష్ణ నటించే అఘోరా పాత్ర కోసం ఇప్పటికే చాల హోమ్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: