రుద్రమదేవి తర్వాత హిరణ్యకశ్యప సినిమా ఎనౌన్స్ చేసిన గుణశేఖర్ ఆ సినిమాను పక్కన పెట్టి శాకుంతలం సినిమా ఎనౌన్స్ చేశాడు. శంకుంతల, దుష్యంతుడుల ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. గుణశేఖర్ దర్శక నిర్మతగా ఈ సినిమా వస్తుంది. గుణ టీం వర్క్స్ బ్యానర్ లో సినిమా క్రేజీగా రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

శాకుంతలం సినిమాలో ముందు అనుష్క నటిస్తుందని అన్నారు. కాని ఇప్పుడు రేసులో మరో ఇద్దరు దర్శకులు లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో పూజా హెగ్దే, కీర్తి సురేష్ లలో ఒకరు హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు ఫైనల్ హీరోయిన్ గా సెలెక్ట్ అవుతారని తెలుస్తుంది. వరుస సినిమాలతో పూజా హెగ్దే సూపర్ టాలెంట్ తో దూసుకెళ్తుంది. ఇక మహానటి బయోపిక్ తో కీర్తి సురేష్ కూడా వరుస క్రేజీ ప్రాజెక్టులను సొంతం చేసుకుంటుంది.

ఈ ఇద్దరిలో ఒకరు శాకుంతలం సినిమా చేస్తే మాత్రం తప్పకుండా వేరే లెవల్ లో ఉంటుందని చెప్పొచ్చు. పూజా, కీర్తి ఇద్దరికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. గుణశేఖర్ పెట్టే బడ్జెట్ కు ఈ ఇద్దరు హీరోయిన్స్ అయితేనే వర్క్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు. మరి గుణశేఖర్ శాకుంతలం సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. గుణ శేఖర్ ఈ ప్రాజెక్టుని చాలా ప్రెస్టిజియస్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. తప్పకుండా అంచనాలను అందుకునేలా ఉంటుందని చెప్పొచ్చు.                                                               

మరింత సమాచారం తెలుసుకోండి: