యంగ్ హీరో నందుతో జోడీ కడుతోంది. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు రాజ్ విరాఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.ఇది ఇలా ఉండగా వాణి పాత్రలో రష్మీ కనిపించనుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో రష్మీ ఈ సారి హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంటుందని సినీ వర్గాల్లో టాక్.
తాజాగా ఈ చిత్రం నుంచి మరో పోస్టర్ ను విడుదల చేసారు..రష్మీకి ఘాటు ముద్దిస్తున్న నందు లుక్ రిలీజ్ చేస్తూ అక్టోబర్ 19వ తేదీన ఉదయం 10 గంటలకు 'బొమ్మ బ్లాక్బస్టర్' సినిమా లోని మొదటి పాట ''రాయే నువ్ రాయే''ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.ఈ పాటను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. పోస్టర్ లో చేతిలో మందు గ్లాస్, నందు రష్మీ ని ముద్దాడినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ ట్రెండ్ అవ్వడం తో పాటుగా సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. థియేటర్స్ ఓపెన్ కాగానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర యూనిట్ పేర్కొన్నారు.