టైటిల్ కొంచెం పాతగానే ఉన్నా సినిమాలో ఎమోషన్ రియాలిటీగా ఉంటుందని ఓపెనింగ్ సమయంలో అన్నారు. అయితే ఆ సినిమా మొత్తానికి ఆగిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే కధ చెప్పినప్పుడు నచ్చిన సినిమా, తెర మీదకు ఎక్కాక మాత్రం ఆ అవుట్ ఫుట్ మీద దిల్ రాజు పెద్దగా శాటిస్ ఫై కాలేదట. దర్శకుడు నరసింహారావు కూడా ఈ సినిమా మీద నమ్మకంగా లేకపోవడంతో సినిమాని ఆపేసినట్లు ప్రచారం జరిగింది. వివి వినాయక్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'శీనయ్య' సినిమా వస్తుందో రాదో తెలియదని కామెంట్ చేశాడు.
ఇక ఈ కామెంట్స్ రావడం ఆలస్యం ఈ సినిమా డౌటేనని, అందుకే హీరోగా నటించిన శీనయ్య రిలీజ్ గురించి ఇలాంటి కామెంట్స్ చేశాడని చెప్పుకుంటున్నారు సినీజనాలు. అయితే కొన్నాళ్లు హీరోగా యాక్టింగ్తో బిజీగా ఉన్న వినాయక్ మళ్లీ మెగాఫోన్ పడుతున్నాడు. చిరంజీవితో లూసిఫర్ రీమేక్ చేస్తున్నాడీ దర్శకుడు. ఇప్పటికే తమిళ సినిమాలు ‘రమణ’ని ‘ఠాగూర్’,‘కత్తి’ని ‘ఖైదీ నం.150’గా రీమేక్ చేసి చిరంజీవికి మెగాహిట్స్ ఇచ్చాడు వినాయక్. అందుకే ఈ రీమేక్ మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.