కెరియర్ మొదట్లో చేసిన రెండు సినిమాలు పెద్దగా ఆడకపోయినా స్టైలిష్ స్టార్ తో చేసిన సినిమా సూపర్ హిట్ అవడంతో అప్పటి నుండి స్టార్ క్రేజ్ తెచ్చుకుంది బుట్ట బొమ్మ పూజా హెగ్దే. అమ్మడు చేస్తున్న సినిమాలు.. అవి అందుకునే సక్సెస్ లు ఆమెకు అదిరిపోయే క్రేజ్ తెచ్చి పెడుతున్నాయి. ఈ క్రమంలో ఆమె క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఆమె వెంట దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. వరుస స్టార్ అవకాశాలతో పూజా హెగ్దే కెరియర్ పీక్స్ లో ఉందని చెప్పొచ్చు.

ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత, మహేష్ మహర్షి, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ప్రసుత్తం ప్రభాస్ తో రాధే శ్యాం, అఖిల్ తో బ్యాచ్ లర్ సినిమాలు చేస్తున్న అమ్మడు మరో రెండు ప్రాజెక్టులను డిస్కషన్ స్టేజ్ లో ఉంచిందని తెలుస్తుంది. అయితే కరోనా వల్ల హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని నిర్మాతల మండలి చెప్పారు. అయితే హీరోయిన్స్ విషయంలో నిర్ణయం తీసుకోలేదు.

అయితే పూజా హెగ్దే మాత్రం తను అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తా అంటుందట. ప్రస్తుతం అమ్మడు సినిమాకు కోటిన్నర నుండి 2 కోట్ల దాకా తీసుకుంటుందని తెలుస్తుంది. తన దగ్గరకు వచ్చిన దర్శక నిర్మాతలకు నో అని చెప్పకుండా సినిమా చేస్తా కాని తన రెమ్యునరేషన్ మాత్రం తగ్గేది లేదని తెగేసి చెబుతుందట. ఎలాగు పూజా ఉంటే గ్లామర్ గురించి ఆలోచించాల్సిన పనిలేది. అందుకే అమ్మడు అసలేమాత్రం తగ్గట్లేదని అంటున్నారు. అయితే పూజా అడిగినంత ఇచ్చి కొందరు ఆమెను ఓకే చేస్తుంటే ఆమె అడిగినంత ఇవ్వలేమని చెప్పి కొందరు సైడ్ అవుతున్నారట.                                              
 

మరింత సమాచారం తెలుసుకోండి: