కేజీఎఫ్ సినిమా కన్నడ చిత్రసీమతో పాటు దక్షిణాది సినీపరిశ్రమలోను ఘన విజయం సాధించింది. ఈ సినిమాను ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్‌ ఎంటర్‌టైనర్‌లో యశ్‌ కథానాయకుడిగా నటించారు. ఇక కన్నడలో రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన తొలి సినిమాగా రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఈ మూవీకి సిక్వెల్ గా 'కేజీఎఫ్-2' తెరకెక్కిందని తెలిపారు. ఈ మూవీ ఇప్పటికే థియేటర్లలో సందడి చేయాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. పాన్ ఇండియా మూవీగా 'కేజీఎఫ్-2' ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 కన్నడ హీరో యశ్ 'కేజీఎఫ్'లో హీరోగా నటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా మొదటి పార్ట్ భారీ విజయం సాధించడంతో 'కేజీఎఫ్-2'పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక బాహుబలి సినిమా సీరిసుల మాదిరిగానే 'కేజీఎఫ్' కూడా విజయం సాధిస్తుందని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారు. దీంతోనే ఓటీటీలో ఈ సినిమాకు వంద కోట్ల ఆఫర్ వచ్చినా థియేటర్లలోనే విడుదల చేసేందుకు చిత్రయూనిట్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం తీస్తున్న రెండో పార్ట్ మొదటి దానికంటే భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారంట. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు గగొర్పొడిచేలా ఉన్నాయని సమాచారం. ఈ క్రమంలోనే సినిమాలో భారీ క్లైమాక్స్ కు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

ఈ మూవీలో హీరో యశ్ తోపాటు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. ఇక సినిమాలో సంజయ్ దత్ ల మధ్య భీకర పోరాట సన్నివేశాన్ని క్లైమాక్స్ లో ప్లాన్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్లైమాక్స్ ను హైదరాబాద్ లో తెరకెక్కించుకున్నారని సమాచారం. ఇటీవలే యష్ హైదరాబాద్ కు చేరుకున్నారు. అలాగే సంజయ్ దత్ కూడా రానున్నట్లు సమాచారం. భారీ క్లైమాక్స్ ను నవంబర్ మొదటి వారం నుంచి తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: