బుల్లి తెరపై కనిపించే యాంకర్లలో హాట్  యాంకర్ గా కొనసాగుతుంది.అయితే  ఈ అమ్మడు యాంకర్ గానే కాకుండా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈటీవీ ప్లస్ లో యాంకర్ రవి తో చేసిన పటాస్ షో వల్ల రొమాంటిక్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది.అయితే ఇటీవల మా టీవీ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో సీజన్ 3 లో పాల్గొన్న ఈ అమ్మడు రన్నర్ గా బాగా ఫేమస్ అయ్యింది.ఇప్పుడు సోషల్ మీడియా లో వేదికగా రచ్చ చేస్తుంది. ప్రస్తుతం జీ తెలుగు లో ప్రసారమవుతున్న బొమ్మ అదిరింది షో లో యాంకర్ గా కొనసాగుతుంది.




ఇది ఇలా ఉండగా.. ఈ అమ్మడు ఇప్పుడు వార్తల్లో మరోసారి నిలిచింది.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో ఉన్న ఇద్దరు యంగ్ యాంకర్స్ ప్రదీప్‌- శ్రీముఖి పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారట. ఈ మేరకు పెళ్లి పత్రిక కూడా రెడీ చేశారు. ప్రస్తుతం ఈ పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఈ విషయం లో నిజం లేదని చాలా మంది అనుకుంటున్నారు.ప్రతి పండుగకు బుల్లితెర చానెళ్లు ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసి స్పెషల్ కిక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఫేమస్ బుల్లితెర యాంకర్స్‌తో కత్తిలాంటి ఈవెంట్స్ ప్లాన్ చేస్తూ పోటీ పడుతున్నాయి టీవీ ఛానెల్స్. ఈ సందర్బంగా జీ తెలుగులో ఓ షో చేస్తున్నారు.



పెళ్లి నిజం కాదు కేవలం ప్రోగ్రామ్ మాత్రమే.. ఇప్పటివరకు సుధీర్, రష్మీపెళ్లి గోల వదిలింది.ఇప్పుడు ప్రదీప్ , శ్రీముఖి లు లైన్ లోకి రావడంతో పలు చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ షో మొదలైన తర్వాత చూడాలి. మొత్తానికి దసరా పండుగ రోజు టీవీ ఛానెల్స్ రచ్చ చేస్తారని తెలుస్తుంది.ప్రస్తుతం యాంకర్ ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రదీప్‌ సరసన అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది. మున్నా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.విడుదలకు సిద్దంగా ఉంది. శ్రీముఖి పలు షో లు చేస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: